News

2024 నాటికి దేశ రొయ్యల పరిశ్రమకు భారీ డిమాండ్ ,ఎగుమతి లో 5% వృద్ధి

KJ Staff
KJ Staff
Indian Shrimp market to attain 5% increase in exports by 2024
Indian Shrimp market to attain 5% increase in exports by 2024

2024 నాటికి భారతదేశంలో రొయ్యల పరిశ్రమ 5% వృద్ధి చెందుతుందని క్యాపిటల్ మార్కెటింగ్ కంపెనీ క్రిసిల్ వెల్లడించింది. క్రిసిల్ నివేదిక ప్రకారం, భారతదేశపు మత్స్య రంగంలో ప్రధాన భాగం అయిన రొయ్యల పరిశ్రమ 2024 ఆర్థిక సంవత్సరంలో 5% వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. భారతదేశం, ఈక్వెడార్ మరియు వియత్నాం రొయ్యల యొక్క మొదటి మూడు అతి పెద్ద సరఫరాదారులుగా ఉండగా, US, EU మరియు చైనా రొయ్యల యొక్క మొదటి మూడు వినియోగదారులలో ఉన్నాయి.

ఈ పెరుగుదల FY2024లో ఎగుమతులను $5.3 బిలియన్లకు పెంచనుంది .రొయ్యల పరిశ్రమలో మెరుగైన డిమాండ్ రొయ్యల ప్రాసెసర్‌ల తో తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రోత్సహిస్తుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది.ఉత్పత్తి వ్యయాలు అనుకూలంగా ఉండటం వల్ల ఈ వృద్ధి ఎక్కువగా వాల్యూమ్-ఆధారితంగా ఉంటుంది, ఈ రంగం నిర్వహణ మార్జిన్ 7.5 శాతానికి తిరిగి రావడానికి వీలు కల్పిస్తుందని నివేదిక పేర్కొంది.

నివేదిక ప్రకారం, ఈ మూడు రంగాలకు భారతదేశం 70 శాతం చేప ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో, ఉత్పత్తి, కంటైనర్ల కొరత మరియు అధిక లాజిస్టిక్స్ ఖర్చుల కారణంగా US మరియు మధ్యప్రాచ్య దేశాలకు తీవ్ర వేడి తరంగాల ప్రభావం కారణంగా భారతీయ రొయ్యల మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి, అలాగే చైనాలో తదుపరి లాక్డౌన్ల వళ్ళ భారతదేశం నుండి ఎగుమతులు క్షీణించాయి. ఇది భారతదేశం యొక్క ప్రధాన రొయ్యల ఎగుమతి పోటీదారుల్లో ఒకటైన ఈక్వెడార్, రొయ్యల ఎగుమతుల్లో ముందంజ వేయడానికి కారణమైంది.

అయితే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో, సాధారణ వాతావరణ పరిస్థితులు మరియు చైనా నుండి స్థిరమైన చేప ఉత్పత్తుల డిమాండ్‌ లు భారతీయ చేపల ఎగుమతిదారులకు చక్కని ఆదాయాన్ని పెంచుతాయని భావిస్తున్నారు.

చైనాకు భారతదేశం యొక్క రొయ్యల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో US $ 0.8 బిలియన్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో US $ 1.2 బిలియన్లను అధిగమించే అవకాశం ఉందని నివేదిక సూచిస్తుంది. మెరుగైన నాణ్యత మరియు వ్యాధి నియంత్రణ చర్యల కారణంగా US మరియు యూరప్ నుండి వినియోగదారులు భారతదేశం నుండి కల్చర్డ్ రొయ్యలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

దీనితో దేశం యొక్క సరఫరా గొలుసు పునరుద్ధరణతో, భారతీయ ఎగుమతిదారులు ఈక్వెడార్ సరఫరాదారులను భర్తీ చేయగలరని మరియు వారి కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందగలరని నమ్ముతున్నరు. చైనా ఆర్థిక వ్యవస్థలో పునరుద్ధరణ భారతదేశం నుండి రొయ్యల ఎగుమతుల వృద్ధికి కూడా దోహదపడుతోంది. 8 నుంచి 10 శాతం వృద్ధి నేపథ్యంలో FY 24లో ఆదాయాలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ హిమాంక్ శర్మ తెలిపారు.

ఇది కూడా చదవండి..

హిమాచల్‌లో పెద్ద ఎత్తున చనిపోతున్న ఇటాలియన్ తేనెటీగలు!ఆపిల్ ఉత్పాదన పై ఎలాంటి ప్రభావం చూపనుంది?

image credit: Daily scavelendian

Soursce: Crisils report on Shrimp exports

Share your comments

Subscribe Magazine