News

ఫోన్ పోయిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్ సేఫ్..

Gokavarapu siva
Gokavarapu siva

నేటికాలంలో సెల్ ఫోన్ కూడా మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే మనకి ఎటువంటి పని జరగట్లేదు. ప్రజలు తమ వ్యక్తిగత మరియు వ్యాపారానికి సంబంధించిన ఎటువంటి సమాచారనైన ఫోన్ లోనే భద్రపరుచుకుంటుంన్నారు. అలాంటి సెల్ ఫోన్ ని ఎవరైన దొంగతనం చేస్తే పరిస్థితి ఏంటి. గత కొన్నేళ్లుగా సెల్‌ఫోన్ దొంగతనాలు గణనీయంగా పెరిగాయి. ప్రజలు కూడా ఫోన్ పోయింది అనేదానికంటే అందులో ఉన్న సమాచారం గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్నారు.

మనం ఎక్కడ ఉన్నా, సమయానికి సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, స్టోర్ చేయడానికి మరియు షేర్ చేయడానికి మొబైల్ ఫోన్‌లు అనివార్యమైన సాధనాలుగా మారాయి. మన చుట్టూ మొబైల్ ఫోన్లు అందించే సౌలభ్యం మరియు కనెక్టివిటీ లేకుండా జీవితం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అందుకని, అవి మన దినచర్యలలో అంతర్భాగంగా మారాయి.

వైద్యుని అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం నుండి స్నేహితుడికి డబ్బు బదిలీ చేయడం వరకు, తాజా వార్తలను తెలుసుకోవడం నుండి ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడం వరకు, మన ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం నుండి రాజకీయ చర్చలలో పాల్గొనడం వరకు, మొబైల్ ఫోన్‌లు మనం ప్రపంచంతో సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చాయి.

ఇది కూడా చదవండి..

50 వేలకు బంగారం రేట్లు భారీగా పతనమయ్యే అవకాశం.. కారణాలు తెలుసా!

అలాంటి మన సెల్ ఫోన్ ని పోగొట్టుకున్న లేదా ఎవరైనా దొంగతనం చేసిన అందులో డేటా చోరీకి గురైనా పలు సున్నితమైన విషయాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, దొంగిలించబడిన ఫోన్‌లను ట్రాక్ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి రాష్ట్ర పోలీసు శాఖ వినూత్న సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఈ విధానంపై అధికారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో శిక్షణా సమావేశం నిర్వహించారు.

టెలికాం మంత్రిత్వ శాఖ CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) అనే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది, ఇది ప్రజలు కోల్పోయిన సెల్ ఫోన్‌లను తిరిగి పొందడంలో సహాయపడుతుంది. ఒకవేళ ఫోన్ దొంగిలించినట్లైతే ఈ సాంకేతికతతో, వినియోగదారులు CEIR వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయవచ్చు మరియు IMEI నంబర్‌ని ఉపయోగించి వారి ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చు. ఇలా చేసిన తర్వాత ఫోన్ పనిచేయదు. ఒకవేళ ఫోన్‌ ఆన్‌చేసి అందులో సిమ్‌ తీసి కొత్త సిమ్‌ వేసినా ఆ విషయం ఫోన్‌ యజమానికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలిసిపోతుంది.

ఇది కూడా చదవండి..

50 వేలకు బంగారం రేట్లు భారీగా పతనమయ్యే అవకాశం.. కారణాలు తెలుసా!

ఎలా ఉపయోగించాలి?

➨వినియోగదారుడు ఒకవేళ ఫోన్ ని పోగొట్టుకుంటే, https://www.ceir.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి బ్లాక్‌ ఫోన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

➨సూచించిన విధంగా వెబ్సైట్ లో మొబైల్‌ నంబర్‌-1, మొబైల్‌ నంబర్‌-2, ఫోన్‌ బ్రాండ్‌, మోడల్‌, ఇన్వాయిస్‌ వివరాలు ఇవ్వాలి.

➨పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, ఇతర చిరునామాలు, అంతకుముందే ఇచ్చిన పోలీస్‌ కంప్లయింట్‌ నంబర్‌, ఫోన్‌ యజమాని చిరునామా, ఈ మెయిల్‌ ఐడీ, ధ్రువీకరణ కార్డులు, చాప్టర్లను సూచించిన బాక్సుల్లో నింపాలి.

➨వెంటనే మీ సెల్‌ఫోన్‌ పాత నంబర్‌ మీద తీసుకున్న కొత్త సిమ్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.

➨దీని తరువాత ఓటీపీ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఇలా చేస్తే మీ పోయిన ఫోన్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా ఎవరు ఆ ఫోన్ వాడలేరు.

➨ఒకవేళ ఫోన్‌ ఆన్‌చేసి అందులో సిమ్‌ తీసి కొత్త సిమ్‌ వేసినా ఆ విషయం ఫోన్‌ యజమానికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలిసిపోతుంది.

➨ఆ సందేశం ఆధారంగా ఫోన్‌ ఎకడ ఉన్నా పట్టుకోవడం సులభతరం అవుతుంది.

➨ఒకవేళ మీకు మీ సెల్ ఫోన్ దొరికితే మీ పాత ఐడీ, ఫోన్‌ నంబర్‌, ఇతర వివరాలు ఇచ్చి మీ సెల్ ఫోన్ ఆన్‌బ్లాక్‌ చేసుకోవచ్చు.

ఈ సాంకేతికత తమ సెల్ ఫోన్‌ను పోగొట్టుకున్న వ్యక్తులకు మరియు వారి వ్యక్తిగత సమాచారానికి అనధికారిక యాక్సెస్‌ను నిరోధించాలనుకునే వారికి సహాయకరమైన పరిష్కారాన్ని అందిస్తుంది.

ఇది కూడా చదవండి..

50 వేలకు బంగారం రేట్లు భారీగా పతనమయ్యే అవకాశం.. కారణాలు తెలుసా!

Related Topics

mobile phone

Share your comments

Subscribe Magazine