News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడ్రోజుల పాటు వర్షాలు..

Gokavarapu siva
Gokavarapu siva

రెండు మూడు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడుతూనే వున్నాయి. మరి కొన్ని జిల్లాలో ప్రజలు ఉక్కపోతకు అల్లాడుతున్నారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు గమనించారు. తత్ఫలితంగా, రాష్ట్రంలోని ఉత్తర మరియు దక్షిణ కోస్తాలలో గణనీయమైన వర్షపాతం ఉండవచ్చని అంచనా వేసింది, ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వాతావరణ శాఖ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉత్తర తీరం వెంబడి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా, తీరప్రాంతాలను ప్రభావితం చేసే శక్తివంతంగా ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచడంతో సముద్ర పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి.

ఇది కూడా చదవండి..

ఉల్లిపాయలపై నల్లటి మచ్చ ఉంటే వాడచ్చా.? అవి మన ఆరోగ్యానికి మంచిదేనా..?

పర్యవసానంగా, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం ద్వారా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కృష్ణా, గుంటూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదనంగా, తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, దీనివల్ల మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేశారు.

ఇది కూడా చదవండి..

ఉల్లిపాయలపై నల్లటి మచ్చ ఉంటే వాడచ్చా.? అవి మన ఆరోగ్యానికి మంచిదేనా..?

Related Topics

rain alert andhra pradesh

Share your comments

Subscribe Magazine