News

50 గ్రాముల బంగారం కోసం 22 ఏళ్ళు పోరాడాడు, మొత్తానికి సాధించాడు

KJ Staff
KJ Staff

22 ఏళ్ల కోర్టు పోరాటం తర్వాత ఎట్టకేలకు శ్యామ్ లవానియా తన బంగారాన్ని సాధించాడు. మథురకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి 2001లో కొనుగోలు చేసిన కూల్డ్రింక్ సీసా మూత కింద 50 గ్రాముల 22 క్యారెట్ల బంగారాన్ని ఇవ్వాలని కన్స్యూమర్ దిస్పుతె రిడ్రెస్సల్ కమిషన్ ఒక ప్రముఖ పానీయాల కంపెనీని ఆదేశించింది.

 

చిన్న వ్యాపారస్తుడైన లావానియా, ఏప్రిల్ 28న తన కొడుకు పుట్టినరోజు వేడుక కోసం కూల్డ్రింక్ బాటిళ్లను కొనుగోలు చేశారు. అందులో ఒక సీసా రివార్డ్ డిక్లరేషన్‌తో వచ్చింది.

కానీ రిటైలర్, హోల్‌సేలర్ మరియు కంపెనీ నుండి దానిని క్లెయిమ్ చేయడానికి అతను ఎంత ప్రయత్నించినా, విఫలమయ్యాడు. దీంతో ఆయన జిల్లా వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్లారు. ఫోరమ్ అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది , అతనికి బంగారు బహుమతిని ప్రదానం చేయాలని కంపెనీని ఆదేశించింది. అయితే తర్వాత కంపెనీ జిల్లా స్థాయి వినియోగదారుల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది. ఏప్రిల్ 11, 2023న, కమీషన్ అతనికి 30 రోజుల్లోగా బంగారు బహుమతి లేదా మార్కెట్ విలువను ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది.

అదనంగా, సంస్థపై ఆర్థిక మరియు మానసిక వేదనకు రూ. 5,000 జరిమానా కూడా విధించబడింది. “కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి ఇటువంటి పథకాలను ఉపయోగిస్తాయని పేర్కొనడం ముఖ్యం. కానీ తరువాత ప్రయోజనాలను అందించడంలో అజాగ్రత్త చూపకండి . ఇది అనైతికం మరియు వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమే’’ అని జిల్లా వినియోగదారుల ఫోరం పేర్కొంది. లావానియా కేసు గెలవడానికి సహాయపడిన సాక్ష్యంగా అతను సమీపంలోని రిటైల్ దుకాణం నుండి కొనుగోలు చేసిన కూల్ డ్రింక్ కోసం రూ. 1,980 బిల్లు మరియు ఏప్రిల్ 30, 2001న హోల్‌సేల్ వ్యాపారిని కలవడానికి ఆగ్రాను సందర్శించినప్పుడు అతను ఉంచిన ప్రయాణ ఖర్చు రశీదు ఉన్నాయి. కానీ , కంపెనీ వాదన ప్రకారం , "ఈ ఆఫర్ ఏప్రిల్ 30, 2001 వరకు చెల్లుబాటులో ఉంది, లావానియా ఆ సమయంలో బంగారు బహుమతిని పొందడంలో విఫలమయ్యాడు అని వాదించారు.

ఇది కుడా చదవండి..

అక్షరాలా కోట్ల రూపాయలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప..

8వ తరగతి వరకు మాత్రమే చదివిన లావానియా మాట్లాడుతూ, “నాకు చట్టం పట్ల చాలా ఆసక్తి ఉంది మరియు వినియోగదారుగా నా హక్కుల గురించి తెలుసు. దానితో నేను నా హక్కుల కోసం పోరాడాను. ఇది ఒక సుదీర్ఘమైన, అలసిపోయిన న్యాయ పోరాటం. ఫూల్‌ప్రూఫ్ సాక్ష్యం ఉన్నప్పటికీ, కంపెనీ పక్షంలో తప్పు చేసినట్లు నిరూపించడానికి నేను 100కి పైగా విచారణలకు హాజరుకావలసి వచ్చింది. నా కుటుంబం మరియు స్నేహితులు కేసును కొనసాగించకుండా నన్ను చాలాసార్లు నిరోధించడానికి ప్రయత్నించారు, ఇది సమయం ,డబ్బు రెండు వృధా చేసే పని అని అన్నారు , కాని నేను కొనసాగుతూనే ఉన్నాను. అతని కుమారుడు ఆకాష్ మాట్లాడుతూ, "జిల్లా కోర్టు తీర్పు తర్వాత, కంపెనీ అధికారులు కూడా కేసును కోర్టు వెలుపల పరిష్కరించుకోవడానికి మా తండ్రిని సంప్రదించారు, కాని మా నాన్న నిరాకరించారు." అని అన్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ,ఎట్టకేలకు 22 ఏళ్ళు పోరాడి తనకి దక్కాల్సింది సాధించాడు.

ఇది కుడా చదవండి..

అక్షరాలా కోట్ల రూపాయలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప..

Share your comments

Subscribe Magazine