News

MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర : బల్బెహ్ర , కైతల్, హర్యానా

KJ Staff
KJ Staff

రైతులు వ్యవసాయానికి చేస్తున్న సేవలను గుర్తించి, వారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడానికి కృషి జాగరణ్ విశిష్టమైన మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డులను బహుకరించడం ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రాముఖ్యత భారత దేశ నలుమూలలకు చేరేందుకు MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర ద్వారా, కృషి జాగరణ్ ప్రతినిధులు భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడి రైతులకు ఈ మిలియనీర్ ఫార్మర్ ఆప్ ఇండియా విశిష్టతల గురించి చాటిచెబుతున్నారు.

గత 27 సంవత్సరాలుగా కృషి జాగరణ్ రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యాక్రమాలను మొదలుపెట్టింది. వాటిలో ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల ప్రధానోత్సవం. వ్యవసాయ రంగంలో విశేషమైన కృషి చేసి లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్న రైతులను ఈ MFOI అవార్డుతో సత్కరిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన MFOI VVIF యాత్ర రధం భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు సంచరిస్తూ రైతులకు MFOI పురస్కారాల విశిష్టతను తెలియపరుస్తారు. MFOI అవార్డులను పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల రైతులంతా అర్హులే, కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 10 లక్షలకు మించి ఉంటేనే ఈ అవార్డు లభిస్తుంది.

ఈ యాత్ర కార్యక్రమం ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నుండి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ యాత్ర రధం దక్షణాది రాష్ట్రాల మీదుగా సాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హర్యాన, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో సంచరిస్తూ రైతులకు MFOI అవార్డుల ప్రత్యేకత గురించి చాటిచెబుతుంది. కృషి జాగరణ్ భారతీయ వ్యవసాయానికి చేస్తున్న కృషి మరియు సహాయం గురించి రైతులకు, కృషి జాగరణ్ సభ్యులు వివరిస్తున్నారు. ఈ రోజు హర్యానాలోని, కారాఉంది గ్రామంలో రైతులతో సమావేశం జరిగింది. ఎంతోమంది ఔత్త్సహికులైన రైతులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కిసాన్ భారత యాత్ర దిగ్విజయంగా కొనసాగడానికి సహాయం చేస్తున్న మహీంద్రా ట్రాక్టర్లు మరియు స్థిల్ కంపెనీ వారు తమ ఉత్పత్తులను రైతులకు ప్రదర్శించారు.


నేడు బల్బెహ్ర , కైతల్, హర్యానాలో జరిగిన ఈ రోడ్ షోలో ఎంతో మంది ఔత్సహికులైన రైతులు పాల్గొన్నారు. మొదట ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులందరికీ, మాఫోయ్ అవార్డుల గురించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, కృషి జాగరణ్ సభ్యులు వివరించారు. తర్వాత ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం వహిస్తున్న, స్థిల్ మరియు మహీంద్రా టాక్టర్స్, తమ ఉత్పత్తులను రైతుల ముందు ప్రదర్శించారు. రైతులు వాటిపనితీరు నేరుగా చూసి వాటిగురించి తెలుసుకున్నారు. కృషి జాగరణ్ ఈ కార్యక్రమాలను అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తుంది. ప్రతి కార్యక్రమానికి రైతులనుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ గ్రామానికి చెందిన రోషన్ కుమార్ అనే రైతు సోదరుడు సహాయసహకారాలు అందించారు. రైతులంతా ఎంతో ఉత్సహకంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

Share your comments

Subscribe Magazine