News

MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: అజ్మెర్, రాజస్థాన్

KJ Staff
KJ Staff

భారతీయ రైతుల అందరిని ఒక తాటి మీద నడిపించేందుకు, మొదలైన MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర మరొక్క మైలు రాయిని చేరుకుంది. ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు సుమారు 600 కిలోమీటర్లు సాగిన ఈ యాత్ర ఇప్పుడు, రాజస్థాన్, అజ్మెర్ వరకు చేరుకుంది. ఉత్తర్ ప్రదేశ్, ఝాన్సీ లక్ష్మి భాయ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ యాత్ర రధం భారత దేశంలోని పశ్చిమ రాష్ట్రాల మీదుగా సాగుతుంది.

లోకసభ ఎన్నికలు 2024: 17 నిండిన వారు కూడా ఓటర్ ఐడి పొందవచ్చా......

అజ్మెర్లోని ఈ కార్యక్రమం, విజయవంత కావడానికి, అక్కడి ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్,(FPO) పుష్కర్ వాలా, మరియు రైతు దుర్గేష్ సైని సహాయసహకారాన్ని అందించారు. అజ్మెర్ లో జరిగిన ఈ భరత్ యాత్ర రోడ్ షో ద్వారా రైతులకు మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా అవార్డుల గురించి, తెలియపరచడమైనది. వ్యవసాయ రంగానికి విశేషమైన కృషి చేసి ఘన విజయాలు సాధిస్తున్న రైతులను సత్కరించడానికి మొదలు పెట్టినవే ఈ MFOI అవార్డులు.

ఈ రోడ్ షో ద్వారా రైతులకు కొత్త వ్యవసాయ పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం జరిగింది. పెరుగుతున్న జనాభా మరియు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, వ్యవసాయ ఉత్పత్తిని, నాణ్యత పెంచడానికి, ఈ పరిజ్ఞానం ఎంతో అవసరం. రైతులకు వ్యవసాయ పరిజ్ఞానం గురించి తెలియచెయ్యడం ద్వారా వారికి, ఆశక్తి పెరిగి, ఈ పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఉపయోగించే అవకాశం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine