News

MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: మావియా, ఫతేపూర్, ఉత్తర్ ప్రదేశ్

KJ Staff
KJ Staff

రైతే దేశానికి వెన్నుముకగా పరిగణిస్తారు. కానీ సేద్యం ద్వారా కొన్ని కోట్ల మంది జనం కడుపు నింపే రైతుకు మాత్రం ఎటువంటి గుర్తింపు లేదు. వ్యవసాయాన్ని, రైతులను చిన్న చూపు చూసే ఈ రోజుల్లో కూడా, ఎంతో మంది రైతులు వ్యవసాయాన్ని వీడక సేద్యాన్ని నిలబెడుతున్నారు. అంతేకాకుండా చాల మంది రైతులు వ్యవసాయం ద్వారా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. అటువంటి రైతులు ఎంతోమందికి ఆదర్శం. వారి గురించి అందరికి తెలిసి, గుర్తింపు ఏర్పర్చడానికి మొదలు పెట్టినవే ఈ MFOI అవార్డులు.

భారత దేశంలోని రైతులందరిని ఒకే త్రాటిపైకి చేర్చి, వారి పడుతున్న కష్టాలను, మరియు నిరంతర కృషి ద్వారా సాధించిన విజయాలను ప్రపంచానికి తెలియచేయడానికి మొదలు పెట్టినవే MFOI అవార్డులు. ఈ అవార్డులను కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. గత 27 సంవత్సరాలుగా కృషి జాగరణ్ రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యాక్రమాలను మొదలుపెట్టింది. వాటిలో ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల ప్రధానోత్సవం. వ్యవసాయ రంగంలో విశేషమైన కృషి చేసి లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్న రైతులను ఈ MFOI అవార్డుతో సత్కరిస్తారు.

MFOI అవార్డుల గురించి దేశంలోని రైతులందరికీ తెలియపరచడానికి MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈ యాత్ర రధం భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు సంచరిస్తూ రైతులకు MFOI పురస్కారాల విశిష్టతను తెలియపరుస్తారు. MFOI అవార్డులను పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల రైతులంతా అర్హులే, కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 10 లక్షలకు మించి ఉంటేనే ఈ అవార్డు లభిస్తుంది.

MFOI VVIF కిసాన్ భరత్ రధం, మధ్య ప్రదేశ్ లోని ఝాన్సీలో మొదలై, మధ్య మరియు పశ్చిమ భారత రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఈ రోజు మావియా, ఫతేపూర్, ఉత్తర్ ప్రదేశ్ రైతులను పలకరించడం జరిగింది. ఈ యాత్రా కార్యాక్రమానికి మహీంద్రా ట్రాక్టర్స్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర లో భాగంగా మహీంద్రా కంపెనీ అనేక వ్యవసాయ అవసరాల కోసం రూపొందించిన ట్రాక్టర్లను నేరుగా రైతుల వద్దకే తీసుకువెళ్లి వాటి పనితీరుపై అవగాహనా కల్పిస్తారు. రైతులు ఈ ట్రాక్టర్ల పనితీరు స్వయంగా చూసి నచ్చితే కంపెనీ నుండి నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు.

అనేక గ్రాముల మీదుగా సాగుతున్న ఈ యాత్రలో ఎంతో మంది రైతులను కలిసి వారి జీవిత గాధలను స్వయంగా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మావియా, ఫతేపూర్, ఉత్తర్ ప్రదేశ్లో MFOI యాత్ర లో భాగంగా ఆ ప్రాంతంలో ఆదర్శ రైతుగా పేరొందిన హరి ఓం అవస్థి గారితో మాట్లాడటం జరిగింది. ఆయన వ్యవసాయంలో అతను ఎదురుకున్న సమస్యల గురించి మరియు వాటి పరిష్కర మార్గాల గురించి కృషి జాగరణ్ సభ్యులతో పంచుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉత్కర్ష ఫార్మ్ ప్రొడ్యూసర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తమ సహాయసహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులందరికీ కృషి జాగరణ్ మంత్లీ మ్యాగజిన్ పుస్తకాలను అందచేసారు.

Share your comments

Subscribe Magazine