![](https://telugu-cdn.b-cdn.net/media/dztbopp2/434401110_744128024533846_6033919157895135455_n.jpg)
భారత దేశం వ్యవసాయ ఆధారిత దేశం, 60% కంటే ఎక్కువ జనాభా తమ జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న వ్యవసాయానికి, అలాగే సేద్యం చేసే రైతులకు మాత్రం ఎటువంటి గుర్తింపు లేదు. రైతు పడుతున్న శ్రమను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి జాగరణ్ ఒక నూతన ఆలచనతో ముందుకు వచ్చింది. దేశానికి రైతులు చేస్తున్న సేవలను గుర్తించి వారిని మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా అవార్డులతో సత్కరిస్తుంది.
MFOI VVIF:
భారత దేశంలోని రైతులందరిని ఒకే త్రాటిపైకి చేర్చి, వారి పడుతున్న కష్టాలను, మరియు నిరంతర కృషి ద్వారా సాధించిన విజయాలను ప్రపంచానికి తెలియచేయడానికి మొదలు పెట్టినవే MFOI అవార్డులు. ఈ అవార్డులను కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. గత 27 సంవత్సరాలుగా కృషి జాగరణ్ రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యాక్రమాలను మొదలుపెట్టింది. వాటిలో ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల ప్రధానోత్సవం. వ్యవసాయ రంగంలో విశేషమైన కృషి చేసి లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్న రైతులను ఈ MFOI అవార్డుతో సత్కరిస్తారు.
MFOI అవార్డుల దేశంలోని రైతులందరికీ తెలియపరచడానికి MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈ యాత్ర రధం భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు సంచరిస్తూ రైతులకు MFOI పురస్కారాల విశిష్టతను తెలియపరుస్తారు. MFOI అవార్డులను పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల రైతులంతా అర్హులే, కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 10 లక్షలకు మించి ఉంటేనే ఈ అవార్డు లభిస్తుంది.
STIHL కంపెనీ సహకారంతో:
MFOI VVIF కిసాన్ భరత్ రధం, మధ్య ప్రదేశ్ లోని ఝాన్సీలో మొదలై, మధ్య మరియు పశ్చిమ భారత రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఈ రోజు ధనోరా, సియోని,మధ్య ప్రదేశ్ రైతులను పలకరించింది. ఈ యాత్ర కార్యాక్రమానికి STIHL ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర లో భాగంగా STIHL కంపెనీ తమ వ్యవసాయ యంత్రాలు నేరుగా రైతుల వద్దకే తీసుకువెళ్లి వాటి పనితీరుపై అవగాహనా కల్పిస్తారు. రైతులు ఈ యంత్రాలు పనితీరు స్వయంగా చూసి నచ్చితే కంపెనీ నుండి నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు.
![](https://telugu-cdn.b-cdn.net/media/4ouddsvo/435240435_744128127867169_4561456602259537721_n.jpg)
మధ్య ప్రదేశ్, ధనోరా, సియోని లోని ఈ యాత్ర విజయవంతం కావడానికి అక్కడి రైతు జితేందర్ సింగ్ సహకారాన్ని అందించారు. కృషి జాగరణ్ సభ్యులు రైతులకు, MFOI అవార్డుల గురించి తెలియచేసారు. అలాగే ఈ అవార్డులు పొందడానికి అర్హత ఉన్న రైతులకు వీటికి ఎలా నమోదు చేసుకోవాలో మార్గదర్శకాన్ని అందించారు.
![](https://telugu-cdn.b-cdn.net/media/cvwgq0j4/435278860_744128027867179_1617629774962554288_n.jpg)
Share your comments