News

ఖరీఫ్ సీజన్ పంటల ఎరువులకై రూ.60,939.23 కోట్ల సబ్సిడీ!

S Vinay
S Vinay

ఖరీఫ్ సీజన్ 2022 కోసం రూ.60,939.23 కోట్ల సబ్సిడీని నరేంద్ర సింగ్ తోమర్ క్యాబినెట్ ఆమోదించింది.

కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర తోమర్ మరియు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా సంయుక్తంగా రాష్ట్రాలు/యుటిల వ్యవసాయ మంత్రులతో ఎరువుల పరిస్థితిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు . ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం, ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (P&K) ఎరువుల కోసం పోషకాల ఆధారిత సబ్సిడీ (NBS) రేట్లకు సంబంధించిన ఎరువుల శాఖ ప్రతిపాదనను ఆమోదించింది.క్యాబినెట్ ఆమోదించిన సబ్సిడీ NBS ఖరీఫ్-2022 కోసం రూ. 60,939.23 కోట్లను కేటాయించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, యూరియా, డిఎపి మరియు N:P:K మరియు ఇతర ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ముందస్తుగా తీసుకుంటున్న చర్యలతో , ప్రస్తుతం, ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల సరఫరా కోసం డిమాండ్ కంటే ఎక్కువ నిల్వలు ఉన్నాయని అన్నారు. రైతులకు లభ్యతకు సంబంధించి తగిన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని మరియు ఎరువుల నిల్వలకు సంబంధించిన భయాందోళనలు లేదా తప్పుడు సమాచారాన్ని సృష్టించవద్దని ఆయన రాష్ట్రాలకు సూచించారు.

ఎరువుల మళ్లింపు వంటి దుర్వినియోగాల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన కేంద్ర మంత్రి, అటువంటి పరిస్థితుల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎరువుల మార్కెట్‌లో ఇటీవలి పోకడలపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ ఎరువులు , నానో యూరియా వినియోగం, సేంద్రియ వ్యవసాయం వంటి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని ఆయన రాష్ట్రాలను కోరారు.

భారతదేశంలో ఎరువుల పరిస్థితిని చర్చిస్తూ, కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ రంగం అధిక జనాభాకు ఉపాధిని అందించే ఒక ముఖ్యమైన రంగం అని పేర్కొన్నారు. "మాకు ప్రాధాన్యత కలిగిన రంగం అయిన వ్యవసాయానికి తోడ్పాటు అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. పెట్టుబడి, కిసాన్ క్రెడిట్ కార్డ్, బీమా పథకాలు, పంటల వైవిధ్యం, ఉద్యానవనం, ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాము. వ్యవసాయ ఉత్పత్తిలో, మేము ఎల్లప్పుడూ అగ్రగామిగా మరియు ప్రపంచ అగ్రగామిగా ఉన్నారు. వ్యవసాయోత్పత్తిలో ఎరువులు ఒక ముఖ్యమైన భాగం మరియు వివిధ ఎరువులపై దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించడమే మా లక్ష్యం. అని వెల్లడించారు.

వ్యవసాయ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, వ్యవసాయ రంగంలో కూడా ఆత్మనిర్భర్‌గా మారేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన అన్నారు. మన రైతులు నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు.వ్యవసాయ ఉత్పత్తులను భారీ ఎత్తున ఎగుమతి చేస్తున్నాము.

కరోనా మహమ్మారి వలన అంతర్జాతీయ స్థాయిలో ముడిసరుకు ధరలు పెరిగినప్పటికీ, సబ్సిడీలను పెంచడం ద్వారా ఎరువుల ధరలను అతి తక్కువ ధరకి ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది దాదాపు 2.5 లక్షల కోట్ల సబ్సిడీని రైతులకు అందించనున్నారు. ఎరువులను నేల స్థాయిలో సమతుల్య స్థాయిలో వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలి. ప్రతి జిల్లా స్థాయిలో ఎంత ఎరువులు అందుబాటులో ఉన్నాయో, ఎంత అవసరమో రాష్ట్రాలు గమనించాలని, దుర్వినియోగం లేదా ఏదైనా తేడాలు లేదా బ్లాక్‌మార్కెటింగ్‌ను నివారించడానికి ప్రతి రైతు ఎంత ఎరువులు కొనుగోలు చేశారనే దానిపై నిఘా ఉంచాలని వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర తోమర్ కోరారు.

మరిన్ని చదవండి.

అరటి లో దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన రకాలను తెలుసుకోండి!

Share your comments

Subscribe Magazine