News

పంటలను రక్షించుకుంనేందుకు కొత్త టెక్నాలజీ !

Srikanth B
Srikanth B

నాగర్‌కర్నూల్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) అధికారులు సౌరశక్తితో నడిచే సెన్సార్ ఆధారిత యానిమల్ ఇంట్రూషన్ డిటెక్షన్ అండ్ రిపెల్లెంట్ సిస్టమ్ (ANIDERS)ని ఏర్పాటు చేశారు, ఇది దాని పరిధిలో అడవి జంతువు సంచరిస్తే హెచ్చరికలను చేస్తుంది తద్వారా రైతులు తమ పొలాలను కాపాడుకోవడంలో సహాయపడటం తో పాటు అడవి జంతువులనుంచి రక్షణ పొందవచ్చు .

ముఖ్యంగా అడవి పందులు, మచ్చల జింకలు పొలాల్లో సంచరించడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. వన్యప్రాణుల సంచారం వల్ల నష్టపోయిన పంటకు అటవీశాఖ పరిహారం చెల్లిస్తున్నప్పటికీ రైతులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రైతులు విద్యుత్ తీగలను పొలాల్లో అమర్చడం ద్వారా కేవలం జతువులకే కాకుండా మనుషులకు కూడా ప్రాణాంతకం కావచ్చు. వలలో చిక్కుకున్న తర్వాత, చాలా తరచుగా, జంతువులు చనిపోతాయని ATR నుండి సీనియర్ అధికారి తెలిపారు.

పదేపదే విజ్ఞప్తులు చేసిన తర్వాత, కొంతమంది రైతులు రాత్రిపూట అడవి జంతువును గుర్తించినప్పుడు శబ్దాలను చేసేందుకు లౌడ్ స్పీకర్లను అమర్చారు. కానీ, రైతులు రాత్రంతా జాగారం చేయవలసి రావడంతో రైతులకు ఇబ్బందికరంగా మారింది.

ఇప్పుడు, వారికి సహాయం చేయడానికి సెన్సార్ లతో పని చేసే ANIDER అనే పరికరాన్ని అమర్చారు ఇది 30-40 మీటర్ల పరిధిలో ఏవైనా జంతువులు వస్తే వేంటనే సైరన్ మోగుతుంది తద్వారా జంతువులను గుర్తించడం సులభం అవుతుంది .

గుడ్ న్యూస్ : ఈ నెల 15 నుంచి ధరణి, భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులు-సీఎం కేసీఆర్

సౌరశక్తి మరియు పర్యావరణ అనుకూలతతో నడిచే ఒక్కో యూనిట్ రూ. 18,000-రూ. 20,000 ఖర్చవుతుంది మరియు రెండు-మూడు ఎకరాల విస్తీర్ణంలో ఇది పని చేస్తుంది . "ఇది విజయవంతమవుతుందని మేము ఆశిస్తున్నాము. రైతుల ఫీడ్‌బ్యాక్ మరియు పరికరం యొక్క సామర్థ్యం ఆధారంగా, వీటి యొక్క పనితీరును గుర్తించి తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు .

వైఎస్సార్ యంత్ర సేవా పథకం.... ట్రాక్టర్ల పై 40% సబ్సిడీ, 50% బ్యాంకు రుణం!

Share your comments

Subscribe Magazine