News

వరి నాట్లు వేస్తున్న ఒరిస్సా యువకులు.. భారీగా పెరిగిన డిమాండ్!

KJ Staff
KJ Staff

గత నాలుగైదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే అధిక వర్షాలు కురవడంతో తెలంగాణలోని పలు ప్రాంతాలలో రైతులు వరి నాట్లు వేయడానికి సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరూ పొలం పనుల్లో నిమగ్నం కావడం వల్ల కూలీల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఒరిస్సా యువకులు అతి తక్కువ ధరకే వరి నాట్లు వేయడంతో వీరికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది.

సాధారణంగా వరి నాట్లు వేయడానికి మహిళలు ఒక ఎకరానికి 5 వేల నుంచి ఆరువేల రూపాయల వరకు రైతుల నుంచి వసూలు చేసేవారు. ఈ క్రమంలోనే ఎక్కువ పొలం ఉన్న వారికి అధిక మొత్తంలో పెట్టుబడి అయ్యేది. అయితే ఒరిస్సా యువకులు ఒక ఎకరానికి మూడు వేల రూపాయలు మాత్రమే తీసుకోవటం చేత రైతులకు తక్కువ ఖర్చు అవుతుంది. ఈ క్రమంలోనే ఈ ఒరిస్సా యువకులకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగిపోయింది.

ఈ యువకులు 20 మంది చొప్పున ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. వీరు ఒక్కో రైతు వద్ద ఎన్ని ఎకరాల పొలం ఉంటే అంత పని కుదుర్చుకుని ఆ పొలం పని పూర్తయ్యే వరకు ఇతరులకు వెళ్లరు. వీరు ఈ పనులు మొత్తం పూర్తయ్యేవరకు సంగారెడ్డి ప్రాంతంలోనే నివసిస్తుంటారు. రైతులు కూడా తక్కువ ధరకే వరినాట్లు వేయడంతో చాలామంది రైతులు ఒరిస్సా యువకుల చేత వరి నాట్లు వేయించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు రైతులు మాట్లాడుతూ ఒరిస్సా కూలీల వల్ల తమకు ఎంతో డబ్బులు ఆదా అయ్యాయని, వరి నాట్లు కూడా ఎంతో చక్కగా వేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

Share your comments

Subscribe Magazine