News

రైతులకు గుడ్‌న్యూస్.. ఈ వారంలో అకౌంట్లలో రూ.2 వేలు జమ

KJ Staff
KJ Staff

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. మూడు విడతలుగా ఈ డబ్బులను లబ్ధిదారులైన రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలు ఇస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం ఇవి అందిస్తోంది.

అయితే రైతులకు ఈ డబ్బులు సరిపోవడం లేదు. మరింతగా సాయం చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో పెట్టుబడి సాయాన్ని రూ.10 వేలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు గతంలో జోరుగా వార్తలొచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ వార్తలను ఖండించింది. ప్రస్తుతానికి పెంచే ఆలోచన లేదని కేంద్రమంత్రులు స్వయంగా పార్లమెంట్ లో వెల్లడించారు. దీంతో కేంద్రానికి ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని తెలుస్తోంది.

అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులను త్వరలో రైతుల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమ చేసే అవకాశముంది. మే 2 తర్వాత ఎప్పుడైనా రైతుల బ్యాంకు అకౌంట్లలో ఈ డబ్బులు పడే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్ 20 మధ్యలోనే తొలి విడత డబ్బులు జమ అయ్యారు.

కానీ కరోనా సంక్షోభం, ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ ఏడాది తొలి విడత నగదు జమలో ఆలస్యం జరుగుతోంది. గత నెలలోనే తొలి విడత డబ్బులు పడాల్సి ఉంది. కానీ ఎన్నికల బిజీలో అధికార యంత్రాంగం ఉండటంతో జాప్యం జరిగింది. ఈ నెలలో ఖచ్చితంగా అడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా కారణంగా పరిపాలనా పరమైన అనుమతుల వల్ల జాప్యం జరిగినట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

Related Topics

pm kisan, money, may

Share your comments

Subscribe Magazine