News

AP కి రెయిన్‌ అలెర్ట్‌.. రానున్న 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ !

Srikanth B
Srikanth B

తెలుగు రాష్ట్రాలలో గత వారం 15 రోజులుగా అక్కడిక వర్షాలు కురుస్తునే ఉన్నాయి , తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కురిసిన అకాలవర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు , మరో మూడు రోజుల పాటు తన ప్రభావం చూపిస్తానంటున్న

ఈ మేరకు రాబోయే మూడు రోజులకు సంబంధించి అమరావతి వాతావరణ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ప్రస్తుతం ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్‌లోని మధ్య ప్రాంతాల నుండి దక్షిణ తమిళనాడు గుండా విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తులో కొనసాగుతున్నది. అలాగే ఆంధ్ర ప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ / నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కలగవచ్చని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు .. 13 న ఫలితాలు !

Related Topics

Heavy Rain Alert

Share your comments

Subscribe Magazine