News

Rain Alert in Telangana:తెలంగాణకు వర్ష సూచన ..రైతులకు వాతావరణశాఖ హెచ్చరిక !

Srikanth B
Srikanth B

Rain Alert in Telangana: తెలంగాణలో సోమవారం (ఏప్రిల్ 18) నుంచి శుక్రవారం (ఏప్రిల్ 22) వరకు ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 30 కి.మీ నుంచి 40కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన  ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ,  సముద్ర మట్టానికి 900 మీ. ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉండడంతో  హైదరాబాద్ తో పాటు  తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం  ఒక మోస్తరు వర్షం  కురిసింది. ఎండ వేడిమితో అల్లాడిపోతున్న జనాలకు వర్షాలు కాస్త ఉపశమనం కల్గించినప్పటికీ

మరోవైపు, రైతన్నలు మాత్రం అకాల వర్షాలపై దిగులు చెందుతున్నారు. యాసంగి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల కారణం గ ఎక్కడ పంట దెబ్బతింటుందోనని ఆందోళన చెందుతున్నారు. వర్ష సూచన నేపథ్యంలో రైతులు జాగ్రత గ ఉండాలని వాతావరణ  శాఖ  హెచ్చరిక జారీచేసింది .

మార్కెట్ లో గరిష్ట ధర పలుకుతున్న మామిడి పండు ... రైతులకు లాభాలు శూన్యం !

Related Topics

IMD Rain Alert Telangana

Share your comments

Subscribe Magazine