News

తెగుళ్ల దాడితో తెలంగాణలో మిర్చి ధరలు ఆకాశాన్నంటాయి; క్వింటాల్‌కు రూ.55,500

Srikanth B
Srikanth B

జనవరి 2022 నుండి, తెలంగాణాలో ఇరవై మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది రైతుల పంటలు తెగుళ్ల బారిన పడ్డాయి . దీనికి తోడు రైతులు చేసిన అప్పులు తీర్చలేక జనవరి 2022 నుండి తెలంగాణలో 20 మందికి పైగా రైతులు ఆత్మహత్యలతో చేసుకున్నారు .

. దీనికి కారణం తెగుళ్ల దాడి వాళ్ళ తీవ్రంగా నష్టపోవడమే దీనికి  ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలలో మానవ హక్కుల వేదిక మరియు స్వతంత్ర సంస్థ ఈ సమస్యను పరిశోధించడానికి ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

“సాధారణంగా మిర్చి పంటకు  ఎకరాకు లక్ష పెట్టుబడి అవసరం. కుటుంబ శ్రమతో పాటు. ఈ సంవత్సరం రైతులు పొలాల్లో లక్షల పెట్టుబడులు పోగొట్టుకున్నారు  అని మానవ హక్కుల వేదిక డాక్టర్ ఎస్ తిరుపతయ్య చెప్పారు. అదేవిధంగా  ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే దాదాపు 40 వేల హెక్టార్లలో మిర్చి పంటలు ఈ బ్లాక్ త్రిప్స్  తెగులు బారిన పడ్డాయి. మరియు పంటల దిగుబడి 10% కంటే తక్కువకు పడిపోయింది. చాలా మంది రైతులు షెడ్యూల్డ్ తెగల రైతులు, చిన్న మరియు సన్నకారు రైతులు. వారు తమ పంటలకు ఇంత నష్టాన్ని భరించలేకపోయారు, ”అని మానవ హక్కుల వేదిక డాక్టర్ ఎస్ తిరుపతయ్య చెప్పారు.

క్వింటాల్‌కు రూ.55,500కి చేరింది.దేశవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడం, తెగుళ్ల కారణంగా పంటలు దెబ్బతినడం వంటి కారణాలతో ధరల పెంపునకు కారణమైంది.

భారతదేశం యొక్క మిరప మార్కెట్

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మిరప ఉత్పత్తి, వినియోగదారు మరియు ఎగుమతిదారు. ఎర్ర మిర్చి కర్ణాటక, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ అంతటా విస్తృతంగా పండిస్తారు.

దేశీ రకం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలలో పండిస్తారు. దీనికి భారతదేశంలో మరియు విదేశాలలో అధిక డిమాండ్ ఉంది. ఇది ఆహార రుచి మరియు రంగులు మరియు రసాయనాల తయారీలో ఉపయోగిస్తారు.

రెండు రాష్ట్రాల్లో మిర్చి పంటకు దాదాపు 40 నుంచి 80 శాతం నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

మిర్చి అధిక పెట్టుబడి పంటగా ఎకరాకు రూ.80,000 నుంచి రూ.1,00,000 వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఇక తెలంగాణలో రైతులు నిస్సహాయంగా మారారు. జనవరిలో పంటనష్టం వాటిల్లితే పరిహారం ఇస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. అయితే రైతులు మాత్రం ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

PM KISAN UPDATE :PM కిసాన్ యోజన డబ్బులు పొందడానికి లోపు eKYC పూర్తి చేయండి !

Share your comments

Subscribe Magazine