News

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 'ఎరువుల 'కొరత ,అధిగమించడానికి భారత్ చర్యలు !

Srikanth B
Srikanth B

"ఈసారి మేము ఖరీఫ్ (వేసవి-విత్తే పంట) సీజన్ కోసం సన్నాహాలు  ప్రారంభించాం . ఎప్పటికి మాదగ్గర  సుమారు ౩౦ మిలియన్ టన్నుల ఎరువులు అవసరం ఉంది  'ఎరువుల' మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు . వేసవి సీజన్ కు అవసరమైన మొత్తం ఎరువుల మొత్తంలో పావు వంతు భారతదేశం వద్ద ఇప్పటికే  సీదాగా ఉన్నాయని మిగిలిన వాటిని త్వరలో భర్తీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు అయన తెలిపారు.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా రవాణాలకు అంతరాయం ఏర్పడిందని , అయితే  వేసవి విత్తే సీజన్ కు తగినంత సరఫరాను నిర్ధారించడానికి కెనడా మరియు ఇజ్రాయిల్ వంటి దేశాల నుండి భారతదేశం ఎరువుల దిగుమతులను పెంచుతోంది అన్ని అయన వెల్లడించారు.

భారతదేశం  వ్యవసాయ రంగానికి సంబంధించి ఎరువుల  ప్రధాన దిగుమతిదారుగా ఉంది, ఇది శ్రామిక శక్తిలో 60% ఉపాధి ని స్తుంది మరియు $2.7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలలో 15% దోహదపడుతుంది.

జూన్ లో రుతుపవనాల వర్షాలు రావడంతో, భారతీయ రైతులు తరచుగా వరి, పత్తి మరియు సోయాబీన్ వంటి పంటలను నాటడం ప్రారంభిస్తారు.

భారతదేశం బెలారస్ మరియు రష్యా నుండి మూడవ వంతులో 4 మిలియన్ నుండి 5 మిలియన్ టన్నుల పొటాష్ ను దిగుమతి చేసుకుంటుంది .

ఇది  పూర్తిగా ఓడల ద్వారా సముద్ర మార్గం ద్వారా  జరుగుతుంది అయితే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా  సముద్ర మార్గం పై ఆంక్షలు కొనసాగుతున్న వేళా దీనిని భర్తీ చేయడానికి ఐపిఎల్ (ఇండియన్ పొటాష్ లిమిటెడ్) కెనడా, ఇజ్రాయిల్ మరియు జోర్డాన్ నుండి తన దిగుమతులను విస్తరించడానికి చర్యలను ప్రారంభించింది . దీనిలో భాగంగా  గ రష్యా, బెలారస్ ల నుంచి సరఫరాలను పాక్షికంగా భర్తీ చేయడానికి కెనడా నుంచి 1.2 మిలియన్ టన్నుల పొటాష్, ఇజ్రాయెల్ నుంచి 600,000 టన్నులు, 2022లో జోర్డాన్ నుంచి 300,000 టన్నులు కొనుగోలు చేయనుంది.

Agri loan instant for farmers: రైతులకు శుభవార్త !మీరు పండించిన పంట పై 100 శాతం లోన్ ... ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి ! (krishijagran.com)

Share your comments

Subscribe Magazine