News

రైతుబంధు: ఖాతాల్లో డబ్బులు జమకాక ఆందోళనలో రైతులు

Gokavarapu siva
Gokavarapu siva

రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం యొక్క నిధులను జమ చేసిన విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఈ రైతుబంధు నిధులు చాలా మంది రైతుల ఖాతాల్లో జమ కాలేదని రైతులు దిగులు చెందుతున్నారు. ఈ రైతుబంధు డబ్బులను బ్యాంకుల నుండి ఎలా పొందాలో రైతులకు అర్ధం కావట్లే.

మల్కాపూర్‌కు చెందిన రైతు తమ గ్రామంలో ఉన్న బ్యాంకు నుండి రూ.30 వేలను పంట రుణంగా తీసుకున్నారు. ఆటను తీసుకున్న పంట రుణాన్ని ఇంకా తిరిగి చెల్లించలేదు. దానితోపాటు మల్లి ఆ లోన్ ని పునరుద్ధరించుకోలేదు. సీతారాం తీసుకున్న లోన్ చెల్లించట్లేదని అతని ఖాతాను నిలిపివేశారు.

ఇంతకీ విషయమేమిటంటే తాజాగా ప్రభుత్వం జమ చేసిన తైతుబంధు డబ్బులు అదే ఖాతాలో పడ్డాయి. వాటిని తీసుకునేందుకు వెళితే ఖాతాను నిలిపివేయడంతో రైతుబంధు డబ్బులు పొందలేని పరిస్థితి నెలకొంది. ఇది ఒకరిద్దరి సమస్య కాదు.. జిల్లాలో రుణాలను పునరుద్ధరించుకోని అనేక మంది రైతుల ఖాతాలను నిలిపివేయడంతో పెట్టుబడి సాయం పొందలేకపోతున్నారు.

ఇది కూడా చదవండి..

సిర్పూర్ మండలంలో రైతుబంధు పథకం ద్వారా కేటాయించిన నిధులను రైతుల పంట రుణాల నుంచి మినహాయించారు. ఎలాంటి తగ్గింపు లేకుండా నేరుగా రైతుబంధు పథకానికి నిధులు బదిలీ చేయాలని పలువురు రైతులు బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించారు. ఫలితంగా, గణనీయమైన సంఖ్యలో రైతులు బ్యాంకులను సందర్శిస్తున్నారు మరియు నిధుల బదిలీని అభ్యర్థించారు,

ఈ సమస్యకు దోహదపడుతున్న మరో అంశం ఏమిటంటే ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని భావించి చాలా మంది రైతులు గత మూడేళ్లుగా పంట రుణాలను చెల్లించలేదు మరియు రెన్యూవల్ చేసుకోకుండా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో, కొంతమంది బ్యాంకర్లు రైతు బంధు సాయం సొమ్మును వడ్డీగా కూడా తగ్గించారు. రైతుబంధు మరియు పంట ఉత్పత్తుల విక్రయం ద్వారా పొందిన ఏదైనా నిధులను నేరుగా రైతులకు అందించాలని పేర్కొన్న ప్రభుత్వ నిబంధనలకు ఇది విరుద్ధంగా ఉంది.

ఇది కూడా చదవండి..

ఆ ఉద్యోగులకు గౌరవ వేతనం మరియు రిటైర్మెంట్ వయసు 62కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం..

ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం తమ పెట్టుబడి సాయం కార్యక్రమంలో భాగంగా వానాకాలం, యాసంగి సాయాన్ని బహుళ విడతలుగా పంపిణీ చేసే విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ సహాయం మొత్తంలో రూ. 2,079.76 కోట్లు, ఉమ్మడి జిల్లాలో 5.79 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. అయితే, రుణమాఫీ కారణంగా గణనీయమైన సంఖ్యలో రైతులు తమ మునుపటి రుణాలను తిరిగి చెల్లించని సమస్య ఉంది. ఫలితంగా, వారి ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి మరియు ప్రస్తుతం అందుబాటులో లేవు.

రుణమాఫీ అవుతుందని రైతులు గతంలో తీసుకున్న రుణాన్ని చెల్లించడం లేదు. కొంత మంది రైతులు తమ రుణాలను పునరుద్ధరించుకుంటున్నారు. గతంలో రూ.50 వేలు రుణం ఉంటే.. దాన్ని గడువులోగా చెల్లించినట్లు చూపి, మళ్లీ రుణం మంజూరు చేయించుకోవడంతో ఖాతాలు రెగ్యూలర్‌ అవుతున్నాయి. పునరుద్ధరణ కాని ఖాతాలు హోల్డ్‌లోకి వెళ్లిపోతున్నాయి.

డిసెంబర్ 11, 2018లోపు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. దీంతో రుణమాఫీ వస్తుందని ఎదురుచూసి రైతులు తమ ఖాతాల రెన్యూవల్‌ చేసుకోకుండా ఉన్నారు. జిల్లాలో 60 శాతం మంది రైతులే ఏటా రుణాలను పునురుద్ధరించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80 వేలకుపైగానే రైతుల ఖాతాలు నిలుపుదల చేశారు.

ఇది కూడా చదవండి..

ఆ ఉద్యోగులకు గౌరవ వేతనం మరియు రిటైర్మెంట్ వయసు 62కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం..

Related Topics

rythubandhu telangana

Share your comments

Subscribe Magazine