News

35 మిలియన్ సంవత్సరాల నాటి అరుదైన పాము శిలాజాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు!

S Vinay
S Vinay

శాస్త్రవేత్తలు లడఖ్ హిమాలయాల నుండి దాదాపు 35 మిలియన్ సంవత్సరాల నాటి అరుదైన పాము శిలాజాన్ని కనుగొన్నారు.

శాస్త్రవేత్తలు మొదటిసారిగా లడఖ్ హిమాలయాల మొలాస్ నిక్షేపాల నుండి మాడ్ట్సోయిడే అనే పాము యొక్క శిలాజాన్ని గుర్తించినట్లు నివేదించారు.మాడ్ట్సోయిడే అనేది అంతరించిపోయిన మధ్యస్థ నుండి భారీ -పరిమాణం గల పాముల సమూహం, ఇది మొదటగ క్రెటేషియస్ లో కనిపించింది మరియు ఎక్కువగా గోండ్వానన్ భూభాగాలలో సంచారించబడింది, మొత్తం సమూహం ఆస్ట్రేలియా మినహా చాలా గోండ్వానాన్ ఖండాల్లోని మధ్య-పాలియోజీన్‌లో అదృశ్యమైంది,చివరిగా టాక్సన్ వోనాంబిలో మనుగడ సాగించింది.

జర్నల్ ఆఫ్ వెర్టిబ్రేట్ పాలియోంటాలజీలో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, ఈ సమూహంలోని పాములు ఈ ఉపఖండంలో గతంలో అనుకున్నదానికంటే ఎక్కువ కాలంమనుగడ సాధించాయి.

కార్గిల్ జిల్లాలోని కార్గిల్-అక్చమల్-బటాలిక్ రహదారి వెంబడి లడఖ్ మొలాస్సే గ్రూప్ దిగువ భాగం నుండి మాడ్ట్సోయిడే పాము శిలాజం సేకరించబడింది.

డా. నింగ్‌థౌజం ప్రేమ్‌జిత్ సింగ్ , డా. రమేష్ కుమార్ సెహగల్, మరియు శ్రీ. అభిషేక్ ప్రతాప్ సింగ్ వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, డెహ్రాడూన్, భారతదేశం నుండి డా. రాజీవ్ పట్నాయక్ మరియు పంజాబ్ యూనివర్శిటీ చండీగఢ్‌కు చెందిన మిస్టర్ వాసిమ్ అబాస్ వజీర్‌లతో కలిసి; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్‌కు చెందిన డాక్టర్ నవీన్ కుమార్ మరియు మిస్టర్ పీయూష్ ఉనియాల్ మరియు స్లోవేకియాలోని కొమెనియస్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఆండ్రెజ్ సెర్నాన్స్కీ మొదటిసారిగా ఓలిగోసీన్ (సెనోజోయిక్ యుగంలోని తృతీయ కాలంలో భాగమైన) మాడ్ట్‌సోయిడే పామును నివేదించారు. సుమారు 33.7 నుండి 35 మిలియన్ సంవత్సరాల క్రితానికి సంబంధించినదని తేల్చేసారు.

మరిన్ని చదవండి.

మనకి జాతీయ భాషే కాదు... జాతీయ క్రీడ కూడా లేదు!

Related Topics

snake fossils

Share your comments

Subscribe Magazine