News

దేశ అవసరాలకు సరిపడా ఆహార ఆహారధాన్యాల నిల్వలు అందుబాటులో ఉన్నాయి: కేంద్రం

Srikanth B
Srikanth B
Sufficient stocks of food grains are available for the country's needs
Sufficient stocks of food grains are available for the country's needs

కనీస మద్దతు ధర పెరగడంతో గత రెండు సంవత్సరాలుగా గోధుమలు, బియ్యం ధరలు ఎక్కువ లేదా తక్కువ పెరిగాయి. ధరలు నియంత్రించడానికి 2021-22 లో ఒఎంఎస్ఎస్ ద్వారా బహిరంగ మార్కెట్ లోకి 80 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలను విడుదల చేయడంతో ధరలు తక్కువగా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం గోధుమలు మరియు బియ్యం తో సహా నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా నెలకొన్న అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి కారణంగా ఆహార భయాల సేకరణ తక్కువగా ఉండడంతో ఇంతవరకు ఒఎంఎస్ఎస్ ద్వారా బహిరంగ మార్కెట్ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. అయితే, ప్రతి వారం ధరల పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్రం ధరలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంది. ధరలు మరింత పెరగకుండా చూడడానికి ప్రభుత్వం 13.05.2022 నుంచి గోధుమ ఎగుమతులు, 08.05.2022 నుంచి బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ చర్యతో గోధుమ, బియ్యం ధరలు తక్షణమే నియంత్రణలోకి వచ్చాయి.

వ్యవసాయ క్షేత్రంలో అత్యున్నత అవార్డు "నార్మన్ E. బోర్లాగ్ " అందుకున్న తెలంగాణ శాస్త్రవేత్త !

ధరలను అదుపు చేసేందుకు మరియు సమాజంలో బలహీన వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజన (PMGKAY)ని మరో మూడు నెలల పాటు (దశ VII) అక్టోబర్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు పొడిగించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని పేదలు మరియు నిరుపేదలకు రాబోయే పండుగ కాలంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ప్రతికూల మార్కెట్ శక్తుల నుంచి ప్రజలకు రక్షణ కలుగుతుంది.

జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA), ఇతర సంక్షేమ పథకాలు మరియు ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజన కింద సరఫరా చేయాల్సి ఉన్న అదనపు అవసరాలకు అవసరమైన ఆహార ధాన్యాల నిల్వలు కేంద్ర పూల్‌లో అందుబాటులో ఉన్నాయని మరియు ధరలు నియంత్రణలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వివరించింది.

వ్యవసాయ క్షేత్రంలో అత్యున్నత అవార్డు "నార్మన్ E. బోర్లాగ్ " అందుకున్న తెలంగాణ శాస్త్రవేత్త !

Share your comments

Subscribe Magazine