News

రైతులకు శుభవార్త: రైతుల కోసం కిసాన్ కార్ స్కీమ్..!

KJ Staff
KJ Staff

మీరు వ్యవసాయం చేస్తున్నారా?వ్యవసాయం చేస్తున్నప్పటికీ కొత్త కారు కొనాలనే ఆలోచనలు ఉంటే మీకిది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. రైతులు కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా రైతులు ఎంతో సులభంగా కొత్త కారును తమ సొంతం చేసుకోవచ్చు.దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్ రైతుల కోసం సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా రైతులు కారు కొనడానికి సులభ పద్ధతిలో రుణాలను అందజేస్తోంది.

రైతులకు ఈ విధమైనటువంటి ఆఫర్ కల్పించడం కోసం టాటా మోటార్స్ సుందరం ఫైనాన్స్ తో జత కట్టి ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే కొత్తగా కారు కొనాలనుకునే రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సుందరం ఫైనాన్స్ ద్వారా కారు మొత్తానికి సరిపడా రుణాన్ని తీసుకోవచ్చు. అయితే ఈ రుణాన్ని ప్రతినెలా కాకుండా ఆరు నెలలకు ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది.

తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి ఆరు సంవత్సరాలు లోపు రుణాన్ని తీర్చాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆరు నెలలకు ఒకసారి వాయిదాలలో కట్టే ఈ పథకాన్ని కిసాన్ కార్ స్కీమ్ అని అంటారు ఆరు నెలలకు ఒకసారి రైతుల చేతికి పంట అందినప్పుడు ఈ వాయిదాలలో చెల్లించే అవకాశాన్ని రైతులకు కల్పించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రైతులు కలలుగన్న కొత్త కారును సొంతం చేసుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine