News

తెలంగాణ ప్రభుత్వం ఫీజులపై కీలక నిర్ణయం.. కేవలం 5% మాత్రమే లాభం తీసుకోవాలి

Gokavarapu siva
Gokavarapu siva

ఫీజుల నియంత్రణ మరియు నిర్వహణకు చురుకైన చర్యలు తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలు కొరకు, తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తున్న రుసుములను నియంత్రించడానికి మరియు పర్యవేక్షించడానికి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హై కోర్టు ఆదేశాలతో మెమో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఇచ్చిన సూచనల మేరకు ఫీజులను నిర్ణయించాలని పాలకమండలి ఆదేశించింది. గవర్నింగ్ బాడీ ద్వారానే ఫీజులు నిర్ణయించాలని ఆదేశాలు జారీ చేసింది. వసూలు చేసిన ఫీజుల ద్వారా వచ్చే లాభం 5 శాతానికి మించకూడదని కేసీఆర్ సర్కార్ హెచ్చరించింది. తీసుకున్న మొత్తం ఫీజులో 50% ఫీజును సిబ్బందికి జీతాలు ఇవ్వాలి మరియు స్కూల్ నిర్వహణ కొరకు 15% ఫీజును వాడుకోవాలని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.

అదనంగా, ఫీజులకు సంబంధించిన అన్ని సంబంధిత వివరాలను పాఠశాల వెబ్‌సైట్ మరియు డైరెక్టరేట్ వెబ్‌సైట్ రెండింటిలోనూ పెట్టాలని పేర్కొంది. స్టేట్ గవర్నమెంట్ తో పాటు సీబీఎస్​ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఐజీసీఎస్​ఈ స్కూళ్లలోనూ ఫీజులు నిర్ణయించే అధికారం ఉంటుందని పేర్కొంది. హై కోర్టు కేసు నుంచి తప్పించుకునేందుకు మెమో ఇచ్చి చేతులు దులుపుకుందని అంటున్నారు పేరెంట్స్ అసోసియేషన్. చట్టం ద్వారానే ఫీజులను నియంత్రించొచ్చు అంటున్నారు పేరెంట్స్.

ఇది కూడా చదవండి..

రైతులు కిసాన్ కార్డు ఎలా పొందాలి? దాని వడ్డీ రేటు ఎంత? పూర్తి వివరాలు తెలుసుకోండి

మరొకవైపు, తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతుల బదిలీలకు హైకోర్టు ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టింది. ఇందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర విద్యాశాఖకు సమర్పించారు. ప్రతిపాదిత ప్రణాళికలో షెడ్యూల్ కోసం నిర్దిష్ట తేదీల ప్రకటన కూడా చేసింది.

ఇది కూడా చదవండి..

రైతులు కిసాన్ కార్డు ఎలా పొందాలి? దాని వడ్డీ రేటు ఎంత? పూర్తి వివరాలు తెలుసుకోండి

Related Topics

telangana govt key decision

Share your comments

Subscribe Magazine