News

భారీగా పెరిగిన కందిపప్పు ధర.. ఇప్పుడు కిలో రూ.200..!

Gokavarapu siva
Gokavarapu siva

దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుండి బియ్యం వరకు అన్నిటి ధరలు భారీగా పెరికిపోయాయి. ప్రజలు ఈ నిత్యావసర సరుకులను కొనుగోలు చేయాలంటేనే వంద సార్లు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ధరలు అంతలా పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో టమోటా, మిర్చి, అల్లం మరియు బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం టమోటా ధరలు తగ్గుముఖం పట్టాయని సంతోషపడేలోపే కందిపప్పు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు 200 రూపాయలకు చేరుకుంది. గతంలో చౌకధరల దుకాణాల ద్వారా కందిపప్పు అందించేవారని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అరకొరగానే పంపిణీ చేస్తున్నారని కార్డుదారులు వాపోతున్నారు. నిత్యావసర వస్తువులు మరియు సేవల ఖర్చులు పెరగడం, అలాగే విద్యుత్ ఛార్జీల పెరుగుదల సాధారణ వ్యక్తులపై గణనీయమైన ఆర్థిక కష్టాలను తెచ్చిపెట్టాయి. పెరుగుతున్న ఈ భారం గృహ అద్దెల ఖర్చులు, పన్నులు, విద్యుత్ బిల్లులు మరియు పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరల మధ్య వారి జీవనోపాధిని కొనసాగించడం వారికి మరింత సవాలుగా మారింది.

కందిపప్పు ధర అమాంతంగా పెరిగితే బతికేదెలా అని వాపోతున్నారు.ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను సమర్థవంతంగా నియంత్రిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్‌పై మహిళలు తీవ్ర నిరాశ, నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన తన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని, దీంతో ప్రజలు నిరాశకు గురయ్యారని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలు తగిన ఉద్యోగావకాశాల కొరతతో బాధపడుతున్నాయి, వేతన జీవులు పట్టణ కేంద్రాలకు వలస వెళ్ళవలసి వస్తుంది, అక్కడ వారు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.

ఇది కూడా చదవండి..

మహిళలకు ప్రతినెల రూ.2000 మరియు ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు.. సోనియా గాంధీ.!

ప్రభుత్వ నియంత్రణ లేకే ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయని వాపోతున్నారు. రెండు వారాల క్రితం మొదటి రకం కందిపప్పు కిలో 145కు లభిస్తే ప్రస్తుతం 175 రూపాయలకు చేరిందని వివరిస్తున్నారు. వారాల వ్యవధిలోనే కిలోపై 30 రూపాయలు ధర పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2018 సంవత్సరంలో, మొత్తం కందిపప్పు ఉత్పత్తి 43 లక్షల టన్నులకు ఉంది, అయితే, ఈ సంఖ్య 2023లో 34 లక్షల టన్నులకు తగ్గింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పప్పు దినుసుల దిగుమతిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధరల పెరుగుదలకు ఉదాహరణగా కంది పప్పు 2018 ఆగస్టులో కిలోకు రూ.65 ధర పలికింది, కానీ ఇప్పుడు కిలో రూ.200కి పెరిగింది.

ఇది కూడా చదవండి..

మహిళలకు ప్రతినెల రూ.2000 మరియు ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు.. సోనియా గాంధీ.!

Share your comments

Subscribe Magazine