News

వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం ఇతనే.. తేల్చేసిన జాతీయ సర్వే

Gokavarapu siva
Gokavarapu siva

ఈ ఏడాది ఐదు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ మరియు మిజోరాం ఉన్నాయి. తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకుని రాష్ట్ర శాసనసభలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కోసం ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది మరియు వరుసగా మూడోసారి అధికారంలో ఉండి హ్యాట్రిక్ సాధించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్ మరియు రాజస్థాన్ రెండింటిలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ పోరును బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కీలకమైన దశలుగా భావిస్తున్నాయి.

ఈ ఐదు రాష్ట్రాల్లో విజయపతాకాన్ని ఎగురవేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే పట్టుదలను అన్ని పార్టీలవారు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్‌సభ స్థానాలకు ఇప్పటికప్పుడు ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే పరిస్థితేమిటనేది ఈ పోల్ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి..

విద్యార్థులకు గమనిక! ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ వాయిదా.. మారిన తేదీలు ఇవే?

ఈ ఒపీనియన్ పోల్ ఫలితాల ఆధారంగా, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని, ప్రతిపక్షాల సంకీర్ణ కూటమి ఇండియా గట్టి పోటీ ఇవ్వగలుగుతుందని అంచనా వేసింది.

ఇటీవ‌ల ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సాధించే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉంటే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు 18 స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏడు లోక్‌సభ స్థానాలకు మాత్రమే పరిమితమౌతారని అంచనా వేసింది.

ఇది కూడా చదవండి..

విద్యార్థులకు గమనిక! ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ వాయిదా.. మారిన తేదీలు ఇవే?

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మూడు లోక్‌సభ స్థానాలను కలిగి ఉంది. అయితే రానున్న ఎన్నికల నాటికి ఈ సంఖ్య ఏడుకు పెరిగే అవకాశం ఉంది. ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ కనీస పోటీని కూడా ఇవ్వలేవని తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం లోక్‌సభ స్థానాలు 17 ఉంటే, వాటిలో బీఆర్ఎస్-8, బీజేపీ-6, కాంగ్రెస్-2, ఏఐఎంఐఎం- 1 స్థానాలు గెలుచుకోవచ్చని తెలిపింది.

ఇటీవలి ఒపీనియన్ పోల్ వైఎస్సార్సీపీలో ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్‌ జగన్‌కు ఈ పోల్ ఫలితాలు నిరాశే అని చెప్పాలి. ఈ సర్వేలో పూర్తి స్వీప్‌ సాధించడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి..

విద్యార్థులకు గమనిక! ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ వాయిదా.. మారిన తేదీలు ఇవే?

Related Topics

Andhra Pradesh AP CM

Share your comments

Subscribe Magazine