News

తిరుపతి : భక్తులకు మాస్కు తప్పనిసారి ... సర్వదర్శనానికి 30 గంటలు

Srikanth B
Srikanth B
TTD UPDATE
TTD UPDATE

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో మాస్క్​ను తప్పనిసరి చేసింది.శ్రీవారి దర్శనానికి కొత్త సంవత్సరం రోజు అధిక మొత్తం లో భక్తులు వచ్చే అవకాశము ఉండడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ బోర్డు వెల్లడించింది , దూర ప్రాంతాల నుంచి భక్తులు తప్పని సరిగా టీటీడీ సూచించిన మార్గదర్శకాలను పాటించాలని , కరోనా వ్యాప్తి దృష్ఠ్య అందర సహకరించాలని భక్తులను సూచించింది . అలాగే, డిసెంబరు 31, జనవరి 1న సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసినట్టు తెలిపారు. జనవరి 2, 3 తేదీల్లో సిఫారసు లేఖలు కూడా స్వీకరించమని చెప్పారు.

ఏకాదశి రోజున ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చన్నారు. జనవరి 2 నుంచి 11 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని, రోజుకు వెయ్యి మంది చొప్పున 10 రోజుల పాటు దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఈ నెల 29 నుంచి జనవరి 3 వరకు అడ్వాన్స్డ్‌‌ విధానంలో వసతిగదుల కేటాయింపు కూడా రద్దు చేసినట్లు TTD వెల్లడించింది .

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటలు, సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 70,496 మంది భక్తులు దర్శించుకోగా 25 వేల మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా టీటీడీ 5.88 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు.

Related Topics

Tirupati TTD

Share your comments

Subscribe Magazine