News

రైతులకు ఇన్పుట్ ఖర్చులు తగ్గింపు పై దృష్టి...కేంద్ర వ్యవసాయ మంత్రి!

S Vinay
S Vinay

న్యూఢిల్లీలోని NASC కాంప్లెక్స్‌లో  2022-23 కోసం వ్యవసాయంపై జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ర్ తోమర్ ప్రారంభించారు.

ముందస్తు అంచనాల ప్రకారం (2021-22)  దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 3160 లక్షల టన్నులుగా అంచనా వేయబడి, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అవుతుందని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు . పప్పుధాన్యాలు మరియు నూనె గింజల ఉత్పత్తి వరుసగా 269.5 మరియు 371.5 లక్షల టన్నులుగా ఉంటుంది.  మూడవ ముందస్తు  అంచనా ప్రకారం 2020-21లో హార్టికల్చర్ ఉత్పత్తి 3310.5 లక్షల టన్నులు .భారతీయ ఉద్యానవనంలో ఇది అత్యధికం. రైతులకు ఇన్‌పుట్ ఖర్చులు తగ్గించేందుకు పురుగుమందులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని మంత్రి పేర్కొన్నారు. యూరియా స్థానంలో నానో యూరియా వచ్చేలా వ్యూహరచన చేయాలని కోరారు. సహజ, సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన ప్రకటించారు. ఎగుమతులపై మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ ఎగుమతులు పెరిగినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడేలా నాణ్యమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎగుమతిదారులు మరియు రైతులు ఇద్దరూ ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.

2022-23 సంవత్సరానికి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం జాతీయ లక్ష్యంగా  3280 లక్షల టన్నులుగా కాన్ఫరెన్స్ నిర్దేశించింది, ప్రస్తుత సంవత్సరంలో 3160 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేసింది. అంతర పంటల ద్వారా విస్తీర్ణాన్ని పెంచడం మరియు తక్కువ దిగుబడినిచ్చే ప్రాంతాలలో

అధిక దిగుబడినిచ్చే రకాలు (HIGH YIELD VARIETIES) ప్రవేశపెట్టడం మరియు తగిన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా ఉత్పాదకత పెంపుదల మరియు పంటల వైవిధ్యం ద్వారా విస్తీర్ణాన్ని పెంచడం  ఈ సదస్సు యొక్క  వ్యూహం.

ఖరీఫ్ సీజన్‌లో పంటల నిర్వహణకు సంబంధించిన వ్యూహాలపై సవివరమైన ప్రజెంటేషన్ చేస్తూ , వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎకె సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల దేశం ఆల్‌టైమ్ అధిక ఆహార ధాన్యాలు, నూనె గింజలు మరియు ఉద్యానవన ఉత్పత్తిని నమోదు చేసిందని అన్నారు. ఇప్పుడు, నూనెగింజలు, పప్పుధాన్యాలు మరియు న్యూట్రియా-తృణధాన్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రుతుపవనాల తర్వాత, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది మరియు వేసవిలో దాదాపు 55.76 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. ప్రభుత్వ విధానాన్ని అనుసరించి, పప్పుధాన్యాలు మరియు నూనెగింజల సాగులో పెరుగుదలతో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రభుత్వం విత్తనాలు మరియు ఎరువుల అవసరాన్ని గుర్తించి మరియు వాటిని సకాలంలో సరఫరా చేస్తుందని వెల్లడించారు.

మరిన్ని చదవండి.

AGRICULTURE:వ్యవసాయ అభివృద్ధికై రెండు కొత్త పోర్టల్స్ ను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి

Share your comments

Subscribe Magazine