News

హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండచరియలు.. 9 మంది మృతి!

KJ Staff
KJ Staff

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది పర్యాటకులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.సంగ్లా-చిత్కుల్ రహదారిలలో బత్సేరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన వారందరూ ఢిల్లీకి చెందిన వారేనని అధికారులు తెలియజేశారు.

హిమాచల్ ప్రదేశ్ లోనే కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈవిధంగా కొండచరియలు విరిగిపడి
బత్సేరి లోయలో ఉన్న ఓ బ్రిడ్జిపై పడటంతో బ్రిడ్జి కోల్పోవడమే కాకుండా అక్కడే ఆగి ఉన్నటువంటి కార్లపై పడటంతో కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే చిత్కుల్ నుంచి సంగ్లాకు వెళ్తున్న ఓ వాహనంపై పెద్ద పెద్ద బండరాళ్లు పడటం చేత ఆ వాహనంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ విధంగా కొండచరియలు విరిగి పడుతున్న దృశ్యాలను స్థానికులు వీడియోగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కొండచరియలు ఏదో పెద్ద భూకంపం సంభవించినట్లుగా పెద్ద పెద్ద బండరాళ్లు ఒక్కసారిగా కింద పడుతున్న దృశ్యాలను చూడవచ్చు. అయితే ఈ కొండ చర్యలు కేవలం రహదారిపై మాత్రమే కాకుండా పర్యాటకులు విశ్రాంతి తీసుకుని గదులపై కూడా పడటంతో అధికంగా ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలను చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Share your comments

Subscribe Magazine