News

పీఎం శ్రీ యోజన అంటే ఏమిటి ?

Srikanth B
Srikanth B

స్వామి వివేకా నంద ప్రకారం మనిషిలోని విజ్ఞానం వెలికి తీసే పదునైన ఆయుధం విద్య , భారత దేశ భవిష్యత్తు విద్య పైనే ఆధారపడి వుంది , విద్యకు అపారమైన శక్తి వుంది ఇది దేశాన్ని అయినా మనిషినైనా మార్చేసే సామర్ధ్యాన్ని కల్గివుంది .

ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా- పీఎం శ్రీ యోజన కింద.. దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేసి, అప్‌గ్రేడ్ చేస్తామని, ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలు సహా ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు. తాజా స్కీమ్‌తో పాఠశాలలు న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ విధానం స్ఫూర్తితో మోడల్ పాఠశాలలుగా మారుతాయని మోదీ అన్నారు.

ఇవి నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ స్ఫూర్తిని నింపే మోడల్ పాఠశాలలుగా మారుతాయి. పీఎం శ్రీ పాఠశాలలు విద్యను అందించడానికి ఆధునిక, పరివర్తన, సంపూర్ణ విధానాన్ని కలిగి ఉంటాయి. డిస్కవరీ- ఓరియంటెడ్‌, లెర్నింగ్‌-సెంట్రిక్‌ బోధనా విధానంపై దృష్టి పెడతాయి. అత్యాధునిక సాంకేతికత, స్మార్ట్ క్లాసులు, క్రీడలకు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.' అని పేర్కొన్నారు.

PM-SHRI Yojana - ద్వారా అధునాత సౌకర్యాల కల్పన

ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. 'ఈ పాఠశాలల లక్ష్యం మెరుగైన బోధన, అభ్యాసం, అన్ని విధాల అభివృద్ధి మాత్రమే కాకుండా, 21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలతో కూడిన సంపూర్ణ, సుసంపన్నమైన వ్యక్తులను సృష్టించడం.' అని తెలిపింది. ఈ పాఠశాలల్లో అవలంబించే బోధనా విధానం మరింత అనుభవపూర్వకంగా, సంపూర్ణంగా, సమగ్రంగా, ఆట/బొమ్మల ఆధారంగా, విచారణ-ఆధారితంగా, ఆవిష్కరణ-ఆధారితంగా ఉంటుందని పేర్కొంది.

ఈ పాఠశాలల్లో ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీలు, స్పోర్ట్స్ పరికరాలు, ఆర్ట్ రూమ్ మొదలైన ఆధునిక మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ పాఠశాలలు నీటి సంరక్షణ, వ్యర్థాల రీసైక్లింగ్, ఇంధన-సమర్థవంతమైన హరిత పాఠశాలలుగా కూడా అభివృద్ధి చెందుతాయని పీఎంవో తెలిపింది.

Bank of Baroda Jobs 2022: ఈ అర్హతలతో బ్యాంకు అఫ్ బరోడాలో రాత పరీక్షా లేకుండా ఉద్యోగాలు ..

Share your comments

Subscribe Magazine