
రైతులకు పంట వేసిన దగ్గర నుంచి అది చేతికి వచ్చేంత వరకు ఆందోళన. పంట వేసిన దగ్గర నుంచి చిన్నపిల్లవాడిని చూసుకున్నట్లు పంటను దగ్గరుండి చూసుకోవాలి. రాత్రి, పగలు అక్కడే ఉండాలి. ఇక సకాలంలో వర్షాలు పడకపోవడం, పంట కొతకు వచ్చే సమయంలో వర్షాలు పడటం వల్ల పంట నష్టపోవడం లాంటివి రైతులకు కన్నీళ్లను మిగిల్చుతున్నాయి.
ఇక పురుగుల బెడదతో పాటు అడవి పందుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. అడవి పందులు పోలాల్లోకి వచ్చి పంటను చెల్లాచెదురు చేస్తాయి. దీని నుంచి పంటను కాపాడేందుకు చాలామంది రైతులు పోలం చుట్టూ కరెంట్ తీగలు వేస్తూ ఉంటారు. అయితే దీని వల్ల మూగజీవాల ప్రాణాలతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది.
ఇాలాంటి తరుణంలో ఒక రైతు వినూత్నంగా ఆలోచించి ఒక గొప్ప ఉపాయం కనుక్కున్నాడు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రొంపి కుంట గ్రామానికి చెందిన కుందారం శ్రీనివాస్ వినూత్నంగా ఆలోచించాడు. వేరుశెనగ పంటను ప్రస్తుతం శ్రీనివాస్ సాగు చేస్తుండగా.. పందుల బెడద నుంచి తప్పించుకునేందుకు ఆ పంట చుట్టూ కుసుమ పంటను సాగు చేస్తున్నాడు
Share your comments