Kheti Badi

4 సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయిన " బాస్మతి బియ్యం "ఎగుమతులు !

Srikanth B
Srikanth B

భారతదేశం యొక్క బాస్మతి బియ్యం ఎగుమతులు గత సంవత్సరం 2021 లో బాస్మతి బియ్యం యొక్క ఎగుమతులు గడిచిన సంవత్సరాలతో పోలిస్తే నాలుగు సమొస్తరాల కనిష్ఠానికి పడిపోయాయి, ఎందుకంటే ప్రధాన  కొనుగోలుదారు అయినా ఇరాన్ తన విదాసి మారక ద్రవ్య విలువలలో రూపాయి నిల్వలు తగిపోవడం వల్ల బాస్మతి బియ్యం యొక్క  కొనుగోళ్లను తగ్గించి నట్లు ప్రభుత్వ అధికారులతో  పటు వ్యాపారవేత్తలు చెప్పారు.

2021 లో దేశం యొక్క బాస్మతి బియ్యం ఎగుమతులు ఒక సంవత్సరం లో  20% పడిపోయి 4 మిలియన్ టన్నులకు పడిపోయాయి, ఇది 2017 సంవత్సరం  లో జరిగిన ఎగుమతులతో పోలిస్తే కనిష్ట స్థాయికి పడిపోయాయని , ఇరాన్  దేశమే యొక్క విదేశి మారకద్రవ్యం నిల్వలలో రూపాయి నిల్వలు క్షీణించిన తరువాత ఇరాన్ గత సంవత్సరం కొన్ని నెలల పాటు మార్కెట్లో క్రియాశీలకంగా లేదు" అని గ్లోబల్ ట్రేడింగ్ హౌస్ తో ముంబైకి చెందిన డీలర్ చెప్పారు.ఇరాన్ గతంలో రూపాయిలకు బదులుగా భారతదేశానికి చమురును విక్రయించే ఒప్పందం కుదుర్చుకుంది, ఇది వ్యవసాయ వస్తువులతో సహా కీలకమైన వస్తువులను దిగుమతి చేసేది,  కాని పై వీటి పై అమెరికా దేశం యొక్క ఆంక్షలు తొలగిపోవడం తో  చమురు దిగుమతులు నిలిపివేసింది , తద్వారా ఇరాన్ దేశం యొక్క రూపప్పీ నిల్వలు క్రమంగా తగ్గి  పోయాయి

టెహ్రాన్ భారతదేశం నుండి వస్తువులను కొనుగోలు చేయడానికి తన రూపాయిలను ఉపయోగించడం కొనసాగించింది, కానీ ముడి మదార్ధాల అమ్మకాలు లేకపోవడం వల్ల రూపాయీ నిల్వలు తగిపోయాయీ, 2020 సంవత్సరం నుంచి ఎగుమతుల మందగమనం కొనసాగుతున్నందున బాస్మతి బియ్యం ఎగ్గుమతులు పడిపోయినట్టు , అదే సమయం లో బంగాళాదేశ్ ,చైనా ,ఆఫ్రికా వంటి దేశాలు బియ్యం యొక్క దిగుమతు లు పెంచడం తో సాధారణ బియ్యం యొక్క ఎగుమతులు పెరిగినట్లు కొందరు ట్రేడర్లు తెలిపారు .

Share your comments

Subscribe Magazine