News

రుణమాఫీ కోసం 31 లక్షల రైతుల ఎదురుచూపు ..

Srikanth B
Srikanth B
రుణమాఫీ కోసం 31 లక్షల రైతుల ఎదురుచూపు ..
రుణమాఫీ కోసం 31 లక్షల రైతుల ఎదురుచూపు ..

తెలంగాణ రైతాంగం ఎంతగానో ఎదురుచూస్తున్న పథకం రుణమాఫీ ఇప్పటివరకు కేవలం 37 వేల వరకు రుణమాఫీని చేసిన ప్రభుత్వం . మిగిలిన లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.మీడియా కథనాల ప్రకారం ప్రభుత్వం రుణమాఫీని ఆగస్టు లేదా సెప్టెంబర్లో చేయనున్నట్లు సమాచారం.

గతంలో 37 వేల నుంచి 90 వేల లోపు రుణాలకు వర్తింపు బడ్జెట్‌లో 6,385 కోట్లు కేటాయింపుతో రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది .

ఈ ఏడాది రూ.90 వేల లోపు గల రైతుల పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ లో ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. గత బడ్జెట్‌లో రైతు రుణమాఫీ కోసం రూ.4,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.2,385 కోట్లు అధికంగా కేటాయించింది. ఈ నిధులతో రూ.37 వేల నుంచి రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు.

రైతుభీమా కొత్త దరఖాస్తులకు 5 రోజులే గడువు ....

మరోవైపు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామన్న సర్కారు ఇందుకు రూ. 19,198 కోట్లు లెక్కగట్టగా ఇప్పటివరకు రూ. 37 వేలలోపు రుణాలున్న రైతులకు రూ. 1,207 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ. 17,991 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటివరకు 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా మరో 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారు.

రైతుభీమా కొత్త దరఖాస్తులకు 5 రోజులే గడువు ....

Related Topics

runamafie scheme

Share your comments

Subscribe Magazine