News

గేదెను కరిచిన పిచ్చి కుక్క... పాలు తాగిన దూడ మృతి ..అవే పాలు తాగిన 300 మంది

Srikanth B
Srikanth B
గేదెను కరిచిన పిచ్చి కుక్క... పాలు తాగిన దూడ మృతి ..అవే పాలు తాగిన 300 మంది
గేదెను కరిచిన పిచ్చి కుక్క... పాలు తాగిన దూడ మృతి ..అవే పాలు తాగిన 300 మంది

 


కొమురం భీం జిల్లాలో జరిగిన ఒక ఘటన ఊరి ప్రజలందరినీ ఆశుపత్రికి పరిగెతించింది. కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలోని ఒక రైతు గేదెను పిచ్చి కుక్క కరిచింది అయితే విషయం తెలిసిన రైతు తనకు ఎం తెలియన్నట్టు అదే బర్రె పాలను ఉరి మొత్తానికి అమ్మాడు ఇంతవరకు సాధారణంగా వున్నా అదే బర్రె పాలు తగిన దూడ మాత్రం చనిపోయింది దీనితో జరిగిన విషయం కాస్త బయటకు పొక్కింది , అవే పాలు తాగిన 300 మంది విషయం తెలుసుకొని ఆందోళనతో ఆసుపత్రికి పరుగులు తీశారు .



గత కొద్ది రోజులుగా గేదె పాలు తాగిన 300 మంది బాధితులు ఆందోళన తమకు కూడా ఏంజరుగుతుందో అన్న భయం భయంతో కాలం గడుపుతున్నారు . భయంతో ఆసుపత్రికి వచ్చిన బాధితులకు టెస్టులు నిర్వహించిన ఆస్పత్రి సిబ్బంది.. యాంటి రేబిస్ టీకాలు వేశారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో.. గ్రామ పంచాయతీ కార్యాలయం లో అత్యవసర మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు అధికారులు. గ్రామం మొత్తాన్ని భయపెట్టిన నాన్నయ్యను చర్యలు తీసుకోవాలని కొందరు అధికారులను కోరినట్లు సమాచారం .

ఇది కూడా చదవండి .

జూన్ రెండో వారంలోగ నైరుతి రుతుపవనాలు..

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine