News

రైతులకు బ్యాంకు అఫ్ ఇండియా వారి ఫెస్టివ్ ఆఫర్లు.. వివరాలు ఇవే

KJ Staff
KJ Staff

బ్యాంకు అఫ్ ఇండియా వ్యవసాయదారు మరియు వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సులువైన రుణాల కొరకు కొత్త స్కీంలు ప్రవేశపెట్టింది. స్కీం వివరాలు తెల్సుకుందాం రండి.

Photo source(UNDP)
Photo source(UNDP)

భారతీయ వ్యసాయాన్ని యాంత్రికారించడం వైపు నడిపించే విధానంలో భాగంగా బ్యాంకు అఫ్ ఇండియా కృషి వాహన్ , ఫార్మ్ మెకనైజషన్ స్కీం లను ప్రవేశపెట్టింది. ఈ స్కీం 2024 మార్చ్ 2024 వరకు కొనసాగనుంది. రైతులు మరియు వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని ఈ స్కీమ్స్ రూపంలో అందించనుంది. వ్యసాయానికి అవసరం అయ్యే యంత్రాలు, పనిముట్లు, వాహనాలు కొనుగోలు చేసందుకు ఈ స్కీం ఎంతగానో ఉంపయోగపడతాయి

Krishi Jagran MOFI VVIF Kisan Bharat Yatra : ఆర్ ఎల్ బి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి ప్రారంభం కాబోతున్న, కృషి జాగరణ్ MFOI, వివిఐఎఫ్ కిసాన్ భారత్ యాత్ర

కృషి వాహన్ స్కీం ద్వారా వ్యవసాయ వాహనాల కొనుగోలులో 90% ఎక్స్ షోరూం ధరను ఈ స్కీం కవర్ చేస్తుంది. రైతులకు 25,0000  వరకు ఎటువంటి కొల్లట్రాల్ అవసరమా లేదా అదే విధంగా వ్యాపారస్తులకు 1 కోటి రూపాయిలు వరకు ఎటువంటి కొల్లట్రాల్ అవసరం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ మెషినరీ కొనుగోలు లో 85% వరకు ఈ లోన్ భర్తీ చేస్తుంది.

సాధికారతకు నిబద్ధత:

రైతులకు మరియు వ్యవసాయ వ్యాపారస్తులకు సాధికారత కల్పించి బ్యాంకు అఫ్ ఇండియా కర్షకులకు ప్రోత్సహాన్నిస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలచనలకు అనుగుణంగా ఈ స్కీమ్స్ రూపొందించబడ్డాయి. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట ఉత్పాదకతను పెంచడం ద్వారా రాబోయే రోజుల్లో భారతీయ వ్యసాయాన్ని సుసంపన్నం చెయ్యడం ఈ స్కీం ముఖ్య ఉద్దెశం.

కృషి వాహన్ కీలక లక్షణాలు:

ఆకర్షణీయమైన వడ్డీ రేటు.

25,0000 వరకు ఎటువంటి కొల్లట్రాల్ అవసరం లేదు.

సులువైన డాక్యుమెంటేషన్ పద్దతి.

తక్షణ రుణ సౌకర్యం.... ఇంకా మరి ఎన్నో


ఫార్మ్ మెకనైజషన్ కీలక లక్షణాలు:

లోన్ తిరిగి చెల్లించడానికి ఎక్కువ కాలం వ్యవధి.

ఆకర్షణీయమైన వడ్డీ రేటు.

1.60 లక్షల ఋణం వరకు ఎటువంటి కాలట్రల్ అవసరం లేదు.

యంత్రాల ధరలో 85% వరకు చెల్లించే అవకాశం.

Agri Tech Madhya Pradesh 2024:మూడు రోజులు జరగనున్న కిషన్ మేళ "మిల్లియనీర్ ఫార్మర్స్ ని" పురస్కరించనున్న కృషి జాగరణ్

Share your comments

Subscribe Magazine