News

రైతులకు కేంద్రం శుభవార్త.. నేడే వారి ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ..!

Gokavarapu siva
Gokavarapu siva

తెలుగు రాష్ట్రాల రైతులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్రం నుంచి ఊరటనిచ్చే వార్త అందింది. ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా కేటాయించిన 15వ విడత నిధులను బుధవారం అనగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. జార్ఖండ్‌లోని ఖుంటిలోని బిర్సా కాలేజీలో పీఎం కిసాన్ పథకం కింద నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు మరియు రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ఈ ముఖ్యమైన పరిణామంలో ఈ పథకం ఒకటి.

మొత్తం రూ.18,000 వేల కోట్లు ప్రధాని మోదీ విడుదల చేయగా, రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా 8 కోట్లకు పైగా రైతులకు ఈ పీఎం కిసాన్ పథకం నగదు ద్వారా లబ్ది పొందనున్నారు.

భారతదేశంలోని చిన్న మరియు సన్నకారు రైతులకు సహాయం చేయడానికి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్నీ ఫిబ్రవరి 24, 2019న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం రైతులకు ప్రతి 4 నెలలకు 2 వేల రూపాయల చొప్పున సంవత్సరానికి 6 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు.

పీఎం కిసాన్‌ ఫైనాన్సింగ్‌ పథకం రైతులకు ఒక వరంలా భావిస్తోంది. ఇంతలో PM కిసాన్ 13వ విడత ఫిబ్రవరి 27, 2023న రైతులకు అందించారు. దీని తరువాత, 14వ విడత జూలై 27, 2023 న రాజస్థాన్‌లోని సిగర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి డబ్బును విడుదల చేశారు.

ఇది కూడా చదవండి..

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు జారీ.. ఎప్పటినుంచంటే?

ఎవరైతే ఈ-కేవైసీ పూర్తి చేస్తారో వారి ఖాతాల్లోనే రూ.2వేలు జమవుతాయి. ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి డబ్బులు అందవు. అందుకే మీ ఈ కేవైసీ పూర్తి చేశారో లేదో తెలుసుకోవాలి. ఈ-కేవైసీ చేయించుకున్న వారిని లబ్దిదారులుగా గుర్తించి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.

పీఎం కిసాన్ 15వ విడత లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అన్నదాతలు అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. వివరాలు తెలుసుకునేందుకు పీఎం కిసాన్ హెల్ప్లైన్ నెంబరు 155261 / 011- 24300606కు కాల్ చేసి వివరాలు తెలుసుకునే ఛాన్స్ ఉంది. మీ పీఎం కిసాన్ బ్యాంక్ ఖాతాతో, ఆధార్ కార్డ్ లింక్ చేస్తేనే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇది కూడా చదవండి..

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు జారీ.. ఎప్పటినుంచంటే?

Share your comments

Subscribe Magazine