News

వంట నూనె ధరలు తగ్గే అవకాశం .. వంట నూనెల దిగుమతి పై రాయితీ పొడగింపు !

Srikanth B
Srikanth B

వంట నూనెల దిగుమతి పై రాయితీని కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది , ఈమేరకు రాయితీని వచ్చే ఆర్థిక సంవత్సరం 2023 మార్చి వరకు పొడిగించింది . సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఆగస్ట్ 31 నుంచి ఈ రాయితీ దిగుమతి సుంకాలను అమలులోకి తీసుకువచ్చింది.

దేశీ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్స్ సరఫరా పెరగాలని, దీని వల్ల రిటైల్ ధరలు అదుపులో ఉండాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ గడువును వచ్చే ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ చర్యతో మార్కెట్ లో నూనె ధరలు స్థిరం గ కొనసాగే అవకాశం వుంది .

అంతర్జాతీయం గ వంట నూనె ధరలు తగ్గుముఖం పడుతున్నాయని , అందువల్ల దేశీ మార్కెట్‌లో కూడా వంట నూనె ధరలు తగ్గుతూ వస్తున్నాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు తగ్గడంతో పాటు ప్రభుత్వపు సుంకాల రాయితీ వల్ల దేశంలో వంట నూనె ధరలు తగ్గాయని తెలిపింది.

సీబీఐసీ తీసుకువచ్చిన రాయితీతో కూడిన దిగుమతి సుంకాలు ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్‌పై 2023 మార్చి వరకు కొనసాగుతాయని ఫుడ్ మినిస్ట్రీ తెలిపింది.

వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇదే కొనసాగుతుంది. ప్రస్తుతం పామ్ ఆయిల్ క్రూడ్ వెరైటీస్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలు జీరో.

దేశ అవసరాలకు సరిపడా ఆహార ఆహారధాన్యాల నిల్వలు అందుబాటులో ఉన్నాయి: కేంద్రం

అయితే అగ్రికల్చర్ సెస్ 5 శాతం, సోషల్ వెల్ఫేర్ సెస్ 10 శాతం వంటివి పరిగణలోకి తీసుకుంటే.. ఈ మూడు క్రూడ్ వెరైటీస్‌పై ఎఫెక్టివ్ దిగుమతి సుంకం 5.5 శాతంగా ఉంటుంది. పామోలీన్, పామ్ ఆయిల్ రిఫైన్డ్ వెరైటీస్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతంగా ఉంది. ఇతర సెస్‌లు కలుపుకుంటే ఈ సుంకం 13.75 శాతానికి చేరుతుంది. రిఫైన్డ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 17.5 శాతంగా ఉంది. ఇతర సెస్‌లను కలుపుకుంటే అప్పుడు ఇది 19.25 శాతానికి చేరుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ధరలకు తగ్గించే ప్రయత్నం గ చాలా సార్లు కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది.

దేశ అవసరాలకు సరిపడా ఆహార ఆహారధాన్యాల నిల్వలు అందుబాటులో ఉన్నాయి: కేంద్రం

Share your comments

Subscribe Magazine