News

రైతులకు శుభవార్త: రైతులకు అందుబాటులోకి 'నానో డీఏపీ'..కేవలం రూ.600లకే

Gokavarapu siva
Gokavarapu siva

ఇఫ్కో సంస్థ రైతులకు శుభవార్త చెప్పింది. ఇటీవలి ఈ సంస్థ నానో యూరియా ని విడుదల చేసిన సంగతి మనకి తెలిసిన విషయమే. దీని మాదిరిగానే నానో డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్పేట్‌)ని రైతులకు అందుబాటులోకి తీసుకువస్తుంది. 2021లో విడుదల కానున్న నానో యూరియా ఇప్పటికే రైతుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి నానో డీఏపీని మార్కెట్లోకి తీసుకురావడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి.

అర లీటరు నానో డీఏపీ బాటిల్, 50 కిలోల ఎరువుతో సమానం. సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఇఫ్కో నానో టెక్నాలజీ ద్వారా లిక్విడ్ మైక్రో ఎరువులను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. నానో యూరియా వలె, 500 ml నానో DAP బాటిల్ 50 కిలోల DAP ఎరువుల బస్తాకు సమానం. మార్కెట్‌లో డీఏపీ ఎరువుల బస్తా రూ.1,350 పలుకుతోంది. నానో యూరియా అర లీటర్ బాటిల్ ధర రూ.600 మాత్రమే. అంటే సంప్రదాయ డీఏపీ ఎరువుల బస్తాతో పోలిస్తే రూ.750 తక్కువ ధరకే డీఏపీ మార్కెట్లో లభ్యమవుతుంది.

పంట సాగుకు DAP ఎరువులు ముఖ్యమైనవి, మరియు "నానో DAP" అని పిలువబడే కొత్త రకం DAP సాంప్రదాయ DAP కంటే మెరుగైన ఎంపిక ఎందుకంటే ఇది మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. నానో DAPలో 8% నత్రజని మరియు 16% భాస్వరం ఉంటుంది, ఇది పంటలకు సరైనది ఎందుకంటే ఇది పోషకాలను సమాన మొత్తంలో అందిస్తుంది.నానో డీఏపీ కణ పరిమాణం 100 నానోమీటర్‌ కంటే తక్కువగా ఉండటం వల్ల విత్తనం లోపలికి, శ్వాస క్రియ ద్వారా మొక్కలలోకి సులభంగా ప్రవేశిస్తుంది.

పంటలకు అవసరమైన నత్రజని (నైట్రోజన్‌), భాస్వరం (ఫాస్పరస్‌ పెంటాక్సైడ్‌)ను సమపాళ్లలో అందిస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలనలో పోషకాల వినియోగ సామర్థ్యం 90 శాతానికి పైగా ఉన్నట్లు నిర్ధారించబడింది. రానున్న ఖరీఫ్‌లో 4.50 లక్షల లీటర్లు (9లక్షల బాటిల్స్‌), రబీలో 5.50 లక్షల లీటర్లు (11లక్షల బాటిల్స్‌) అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్: ఆర్బీకేల ద్వారా తక్కువ ధరలకే మిర్చి విత్తనాలు..

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌లో 12.5 లక్షల లీటర్లు, రబీ సీజన్‌లో 17.5 లక్షల లీటర్ల నానో యూరియాను కేటాయిస్తోంది. గ్రామస్థాయి ఆర్బికేల ద్వారా ఈ నానో యూరియా మరియు నానో డీఏపీ ఉత్పత్తుల వినియోగాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. త్వరలో నానో జింక్, నానో కాపర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది.

ఖరీఫ్-1021లో మార్కెట్‌లోకి తీసుకొచ్చిన నానో యూరియా వినియోగంపై రైతుల్లో ఆసక్తి పెరిగింది. ఖరీఫ్-21లో రాష్ట్రంలో 17,000 లీటర్ల నానో యూరియా విక్రయించబడింది. మరుసటి ఏడాది 2.73 లక్షల లీటర్లు అమ్ముడయ్యాయి. 2022-23 ఖరీఫ్‌లో 1.25 లక్షల లీటర్లు, రబీలో 2.40 లక్షల లీటర్లు అమ్మకాలు జరిగాయి. సూక్ష్మ ఎరువులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నందున, రైతుల్లో అవగాహన పెరిగింది మరియు 2023-24 వ్యవసాయ సీజన్ నుండి నానో-యూరియా నిల్వలను పూర్తిగా అందుబాటులో ఉంచడానికి ఇఫ్కో ఏర్పాట్లు చేసింది.

ఇది కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్: ఆర్బీకేల ద్వారా తక్కువ ధరలకే మిర్చి విత్తనాలు..

Related Topics

nano dap farmers iffco

Share your comments

Subscribe Magazine