News

రైతులకు గుడ్ న్యూస్.. రేపే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమ..

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా పరివర్తన చెందుతున్నాయి, ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ కార్యక్రమాలు మరోసారి తనకు అధికారం కట్టబెడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్షేమ క్యాలెండర్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ పథకాల అమలుపై సీఎం జగన్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్తను అందించింది. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా వారికి ఆర్ధిక సాహాయాన్ని అందిస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ నవంబర్ నెల 7వ తేదీ అనగా రేపు వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత సహాయాన్ని రైతులకు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు ముముర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 7న అంటే రేపే సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌.

ఇది కూడా చదవండి..

మరో రెండు రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఐఎండి అలర్ట్‌

ఈ సందర్భంగా పుట్టపర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు రేపు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు మరియు ఈ అభివృద్ధి గురించి సీఎం జగన్ స్వయంగా ప్రజలకు తెలియజేస్తారు. మధ్యాహ్నం సీఎం జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ ఈరోజు వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జగనన్న సురక్ష యాత్ర పురోగతిపై కలెక్టర్లతో కలిసి చర్చలు జరపనున్నారు. ఈ ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి జరుగుతుంది.

ఇది కూడా చదవండి..

మరో రెండు రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఐఎండి అలర్ట్‌

Share your comments

Subscribe Magazine