News

ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.. ఈ 17న రైతులకు పట్టాలు..

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్తను అందించింది. ఈ నెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లంకలో భూములున్న రైతులకు ధ్రువపత్రాలు అందజేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన రాష్ట్రంలోని రైతులకు శుభవార్త అనే చెప్పాలి.

ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలతోపాటు వివిధ జిల్లాల్లో మొత్తం 9,062 ఎకరాలకు పట్టాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూములను ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న రైతులకు సాధికారత కల్పించడంతోపాటు వారికి చట్టపరమైన గుర్తింపును అందించడం ప్రభుత్వ లక్ష్యం.

ఈ కార్యక్రమం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ రంగం సంక్షేమం మరియు శ్రేయస్సు పట్ల ప్రభుత్వ నిబద్ధతను చూపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ చర్య నిజంగా అభినందనీయం మరియు ఇతర రాష్ట్రాలు తమ వ్యవసాయ వర్గాల సంక్షేమం మరియు సాధికారతను నిర్ధారించడంలో అనుసరించడానికి సానుకూల ఉదాహరణగా నిలుస్తుంది. ఈ నిర్ణయంతో 17,768 మంది రైతుల కుటుంబాలు లబ్ధి పొందనున్నారు.

ఇది కూడా చదవండి..

సీఎం జగన్ శుభవార్త.. తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్న ప్రభుత్వం..!

ఇక అటు సామాజిక పెన్షన్లపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు అర్హులు ఉంటే అందులో ఒక్కరికే పెన్షన్ ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్ లో తెచ్చిన జీవోలో జోక్యం చేసుకోలేని స్పష్టంచేసింది.

ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అంటూ పిల్ ను వేసింది. అయితే కుటుంబంలో వితంతు, వృద్ధాప్య పెన్షన్ తో పాటు 80%కి పైగా అంగవైకల్యం, డయాలసిస్ బాధితులకు పెన్షన్ ఇస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

ఇది కూడా చదవండి..

సీఎం జగన్ శుభవార్త.. తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్న ప్రభుత్వం..!

Share your comments

Subscribe Magazine