News

రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త..! మూడు నెలలపాటు మహిళలకు జగన్ నిధుల ప్రవాహం.!

Gokavarapu siva
Gokavarapu siva

ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో ఎన్నికల కేంద్ర బిందువు సంక్షేమమే ధ్యేయంగా ఉంది. అధికారాన్ని పొందేందుకు మరియు నిలబెట్టుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు కీలకమని అన్ని రాజకీయ పార్టీలు విశ్వవ్యాప్తంగా నమ్ముతున్నాయి. తాజాగా తెలంగాణలోనూ బీఆర్ఎస్ సంక్షేమమే లక్ష్యంగా మూనిఫెస్టో ప్రకటించింది. రాష్ట్రంలో సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలను కూడా కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, రాబోయే 2024 ఎన్నికలలో మరో విజయాన్ని సాధించడంలో కీలకమైన అంశంగా ఈ కార్యక్రమాలను స్థాపించడానికి జగన్ ప్రాధాన్యతను ఇచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల వ్యూహాలను చురుగ్గా మెరుగుపరుచుకుంటూ, విజయవంతమైన ఎన్నికల ఫలితాలను సాధించేందుకు తన అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పలు ఎన్నికల కార్యక్రమాలను పక్కాగా ప్లాన్ చేసుకున్న జగన్ ఇప్పుడు పాలనకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి సారించారు. తాను నమ్ముకున్న సంక్షేమ ఓట్ బ్యాంక్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి, జగన్ పరిపాలన సంక్షేమ కార్యక్రమాల కోసం 2.35 లక్షల కోట్ల రూపాయలను విజయవంతంగా కేటాయించి, సమాజంలోని పేద వర్గాలకు ప్రయోజనం చేకూర్చింది. దీంతో, జగన్ కు కౌంటర్ గా చంద్రబాబు పార్టీ మహానాడు వేదికగా సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించారు. కానీ, ప్రజల నుంచి స్పందన కనిపించలేదు.

2014 నుంచి 2019 కాలంలో ఇచ్చిన హామీలు నెరవేరక పోవడంతో జగన్ తన పాదయాత్ర ద్వారా చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీశారు. 2019లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఎన్నో అవాంతరాలు, సవాళ్లు ఎదురైనా జగన్ తన మాటకు కట్టుబడి అనేక పథకాలు అమలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ..!

మహిళల ఓటు బ్యాంకు మద్దతును పొందేందుకు, ప్రత్యేకంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టారు. రాబోయే ఎన్నికలకు మూడు నెలల ముందు నుండి ప్రత్యేకంగా మహిళల కోసం గణనీయమైన నిధులు కేటాయించారు. చ్చే జనవరి నుంచి పెన్షన్ రూ 3000కి పెంచనున్నారు. జనవరి 10 నుంచి వైఎస్సార్ చేయూత ప్రారంభం కానుంది. మరో అయిదు వేల కోట్ల మేర ఇవ్వటం ద్వారా ఈ పధకం ద్వారా రూ 19 వేల కోట్లు మహిళల ఖాతాల్లో జమ కానున్నాయి,

జనవరి 20 నుంచి జనవరి 30 వరకు వైఎస్ఆర్ ఆసరా నిధుల తుది పంపిణీ జరగనుంది. పొదుపు సంఘాలకు నాలుగు విడతలుగా 19,178 కోట్ల రుణాలు పంపిణీ చేయగా, చివరి విడతా మరో 6,500 కోట్లు ఇవ్వనున్నారు. దీని ద్వారా మొత్తంగా 26 వేల కోట్లు అందించినట్లవుతుంది. పొదుపు సంఘాలల్లో ఉన్న మహిళలను ఆదుకునేందుకు 31 వేల కోట్ల రూపాయలను అందించినట్లు ప్రభుత్వం సగర్వంగా తెలిపింది.

ఇది కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ..!

Share your comments

Subscribe Magazine