News

రైతులకు శుభవార్త : రైతులఖాతాలో నేడే రైతుభరోసా డబ్బులు..స్టేటస్ చెక్ చేయండి ఇలా !

Srikanth B
Srikanth B
రైతులకు శుభవార్త : రైతులఖాతాలో నేడే రైతుభరోసా డబ్బులు..స్టేటస్ చెక్ చేయండి ఇలా !
రైతులకు శుభవార్త : రైతులఖాతాలో నేడే రైతుభరోసా డబ్బులు..స్టేటస్ చెక్ చేయండి ఇలా !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం గ పీఎం కిసాన్ ను కలుపుకొని సంవత్సరానికి 3 మూడు దఫాలలో 13500 రూపాయలను ఆర్థిక సాయంగా అందిస్తుంది . 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మొదటి విడత ఆర్థిక సాయంగా రైతుభరోసా డబ్బులను రైతుల ఖాతాలో నేడు జమ చేయనుంది .

 

రైతు వారి ఖాతాలలో డబ్బులు వచ్చాయో లేదో చాల సులువుగా తెలుసుకోవచ్చు .

మొదట https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html లింక్ పై క్లిక్ చేయండి .

ఇప్పుడు మీ కుడివైపు know your status అనే ఎంపిక పై క్లిక్ చేయండి .

తరువాత మీకు 2023-24 సంవత్సరం రైతు భరోసా స్టేటస్ కనిపిస్తుది దానిపై క్లిక్ చేయండి .

2023-24 స్టేటస్ పై క్లిక్ చేసిన తరువాత మీ ఆధార్ నెంబర్ ను టైప్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి .

ఇప్పుడు మీకు మీ రైతు భరోసా స్టేటస్ కనిపిస్తుంది .

రైతులకు శుభవార్త: సబ్సిడీతో ఆర్బికేలా ద్వారా విత్తనాల పంపిణీ ప్రారంభం..

రైతుభరోసా కేంద్రం లో పిర్యాదు చేసిన తరువాత అప్లికేషన్ నెంబర్ ను పొందుతారు . ఈ అప్లికేషన్ నెంబర్ తో https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html లింక్ పై క్లిక్ చేసే మీ పిర్యాదు యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు . ఇక్కడా కూడా మీ ఆధార నెంబర్ ను ఇస్తే సరిపోతుంది .

రైతు భరోసా కు ఎన్ని నిధులు విడుదల చేస్తున్నారు ?

వైఎస్సార్‌ రైతుభరోసా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత పెట్టుబడి సాయం, నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు 2023-24లో తొలివిడతగా 52.31 లక్షలమందికి రూ.3,934.25 కోట్లు జమచేయనున్నారు .

రైతుభరోసా డబ్బులు రాకుంటే ఎం చేయాలి ?

రైతు భరోసా డబ్బులు పొందని రైతులు సమీప రైతుభరోసా కేంద్రం లో పిర్యాదు చేయవచ్చు .

రైతులకు శుభవార్త: సబ్సిడీతో ఆర్బికేలా ద్వారా విత్తనాల పంపిణీ ప్రారంభం..

Related Topics

Raithu Bandu ysr aasara

Share your comments

Subscribe Magazine