News

రైతులకు గుడ్‌న్యూస్.. రెండు విడతల డబ్బులు వెంట వెంటనే..

KJ Staff
KJ Staff

రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అందులో భాగంగా రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులైన రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఆర్థిక సహాయం రూపంలో ఇస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వీటిని కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది.

ఇప్పటికే ఏడు విడతల నగదును నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయగా.. 8వ విడత నగదును ప్రస్తుతం జమ చేస్తోంది. అయితే ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని రైతులు ఉంటే.. ఇప్పుడు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 31లోపు దరఖాస్తు చేసుకుంటే రెండు విడతల డబ్బులను వెంటవెంటనే పొందవచ్చు.

ఏప్రిల్‌ 1 -జులై 31, ఆగస్టు 1 -నవంబర్‌ 30, డిసెంబర్‌ 1-మార్చి 31 వరకు.. ఇలా మూడు విడతలుగా డబ్బులు రైతుల బ్యాంకు అకౌంట్లలో మూడు విడతలుగా కేంద్రం జమ చేస్తోంది. మార్చి 31లోపు అప్లై చేసుకుంటే.. డిసెంబర్‌ 1 నుంచి మార్చి 31 విడతల డబ్బులు పొందవచ్చు. ఆ తర్వాత ఏప్రిల్‌ నుంచి జూలై ఇన్‌స్టాల్‌మెంట్‌ వస్తుంది.

ఇప్పటికీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని రైతులు ఉంటే.. వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ పథకం నుంచి లబ్ధి పొందండి. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక బీమా పథకాలు ప్రవేశపెట్టింది. వాటికి కూడా అప్లై చేసుకుని లబ్ధి పొందడం మంచిది.

Related Topics

PM Kisan farmers money, apply,

Share your comments

Subscribe Magazine