News

రాష్ట్రంలో నాలుగు రోజులు వానలు.. వాతావరణ శాఖ సూచనలు జారీ !

Srikanth B
Srikanth B
Rain Alert for Telangana
Rain Alert for Telangana

రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి మరో వైపు కొన్ని చోట్ల రాత్రి అయితే వర్షాలు కురుస్తున్నాయి దీనితో రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొంది , మరోవైపు రానున్న 4 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతవరణ శాఖ సూచనలు జారీ చేసింది , వరి కోతకు వున్నా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీచేసింది .


ఒక మోస్తరు నుంచి ఈదురు భారీ వర్షాలు కురువనునట్లు వాతావరణ శాఖ వెల్లడించింది రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, మెదక్​, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రానున్న ఆది ,సోమ ,మంగళ ,బుధ వారాలవరకు మోస్తరు వర్షాలు కురవచ్చని దీనితోపాటు ఉష్ణోగ్రతలు ఉక్కపోత కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది .

అధికారం లో రాగానే 2 లక్షలు రుణమాఫీ !

గత రెండ్రోజులుగా ఎండలు కాస్త తగ్గినా.. ఉక్కపోత ఎక్కువగానే ఉంటోంది. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 42.5 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూర్​లో 42.4 డిగ్రీలు, ఖమ్మం జిల్లా ప్రకాశ్​నగర్, భద్రాద్రి జిల్లా మణుగూరు, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా జంబుగ, జయశంకర్​ జిల్లా మహదేవ్​పూర్​లో 42.2, సూర్యాపేట జిల్లా మునగాలలో 42.1, మహబూబాబాద్​ జిల్లా బయ్యారం, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42 డిగ్రీల వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి .

అధికారం లో రాగానే 2 లక్షలు రుణమాఫీ !

Share your comments

Subscribe Magazine