News

హైదరాబాద్‌ శివార్లలో మార్కెట్‌ ధరలకే సామాన్యులకు ప్లాట్లు..

Gokavarapu siva
Gokavarapu siva

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నగర శివారుల్లో ఉన్న భూములను వేలం వేయాలని నిర్ణయించుకుంది. దీనికొరకు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములైన ల్యాండ్ ను ప్లాట్లగా విభజించి వాటిని ప్రజలకు మార్కెట్ లోని ధరలకే ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పారదర్శకంగా ఈ ల్యాండ్‌ ప్లాట్లను ఆన్ లైన్ పద్దతిలో వేలం ద్వారా ఈ స్థలాలను అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఆన్‌లైన్‌ లో ఎంఎస్‌టీసీ ద్వారా ఈ వేలం అనేది నిర్వహించనుంది. 39 ల్యాండ్ పార్సెల్స్ అనేవి అవుటర్ రింగ్‌రోడ్డు దగ్గరలో 3 జిల్లాల పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతజం వీటిని అమ్మడానికి ప్రభుత్వం యోచిస్తుంది.

ఈ ప్లాట్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే మనం కేఎంఎల్‌ ఫైల్‌ ద్వారా చూసుకునే సదుపాయం కల్పించారు. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 6, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్‌ పార్సెళ్ల కొనుగోలుదారుల కోసం సిద్ధంగా ఉంచారు. ఈ ప్లాట్లు అనేవి 121 గజాల నుంచి 10,164 గజాల వరకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి అని ప్త్రభుత్వం తెలిపింది. అది కూడా సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉన్నాయి.

వేలం వేస్తున్న ఈ ప్లాట్లపై కొనుగుదారులకు అవగాహన కల్పించడానికి ఈ మంగళవారం నుండి హెచ్ఎండీఏ ప్రీబిడ్‌ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ పార్సిల్స్‌పై శేరిలింగంపల్లి జోనల్‌ ఆఫీసులో 22న సంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ పార్సిల్స్‌పై ఆర్సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో 23న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ల్యాండ్‌ పార్సిళ్లపై ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉన్న సర్కిల్‌ ఆఫీసులో ప్రీబిడ్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..

పోడు రైతులకూ రైతు బంధు, రైతు బీమా-స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఈ ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అవ్వాల్సి ఉంటుంది.
రిజిస్టర్‌ అయినవారు ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశించిన డిపాజిట్‌ రుసుమును చెల్లించాల్సి ఉంటుందని హెచ్ఎండీఏ వెల్లడించింది. ఈ భూములను కొనుగోలు చేసినవారు వెంటనే వారి ఇంటి నిర్మాణానికి అనుమతులు కూడా పొందుతారని వెల్లడించింది. ఈ భూములకు ఎటువంటి చిక్కులు కూడా ఉండవు.

మార్చి ఒకటో తేదీన మొత్తం 39 ల్యాండ్‌ పార్సిల్స్‌ను ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించడానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాట్లు అనేవి రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలంలో 3, శేరిలింగంపల్లి మండలంలో 5, ఇబ్రహీంపట్నం మండలంలో రెండు చోట్ల ల్యాండ్‌ పార్సల్స్‌ ఉండగా మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలో 4, ఘట్‌కేసర్‌ మండలంలో ఒకటి, బాచుపల్లి మండలంలో ఒకటి చొప్పున ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండల పరిధిలో 16, ఆర్‌సీపురం మండలంలో 6, జిన్నారం మండలంలో ఒకటి చొప్పున ల్యాండ్‌ పార్సిల్స్‌ ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి..

పోడు రైతులకూ రైతు బంధు, రైతు బీమా-స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Related Topics

plots

Share your comments

Subscribe Magazine