
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు ఆర్థిక సహాయం చేస్తోన్న విషయం తెలిసిందే. రూ.2 వేలు చొప్పున మూడు విడతలుగా ఈ నగదును నేరుగా లబ్ధిదారులైన రైతులు బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున కేంద్రం ఇస్తుంది
హోలీకి ముందు లేదా తర్వాత ఈ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయి. పీఎం కిసాన్ పథకం కొనసాగుతూనే ఉంటుందని, పీఎం కిసాన్ వెబ్సైట్లో రాష్ట్రాలు అప్లోడ్ చేసిన లబ్ధిదారుల జాబితా ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. అలాగే తాము కూడా వివిధ ఏజెన్సీల ద్వారా లబ్ధిదారుల జాబితాను వెరిఫై చేసిన అనంతరం డబ్బులు జమ చేస్తామన్నారు. `
అటు పీఎం కిసాన్ నగదును పెంచే ఆలోచన ప్రస్తుతం లేదని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అయితే వచ్చేవారంలోనే రానున్న పీఎం కిసాన్ డబ్బులు మీకు పడతాయో లేదో తెలుసుకునేందుకు ఈ క్రింది విధంగా చేయండి.
Share your comments