News

రైతుల ఖాతాల్లో నేడే పీఎం కిసాన్ డబ్బులు జమ.. మీ ఖాతాలో పడ్డాయో లేదో ఇలా తెలుసుకోండి!

KJ Staff
KJ Staff

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలురకాల పథకాలను ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా ప్రతి యేటా రైతులకు 6 వేల రూపాయల నగదును వారి ఖాతాల్లో జమ చేయనుంది.అయితే ఈ డబ్బు మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాలలో జమ చేస్తారు.ఇప్పటికే ఈ పథకం ద్వారా రైతులకు 8 విడతల డబ్బులు వారి ఖాతాలో జమ చేశారు. ఇక 9 వ విడత డబ్బులు నేడే రైతుల ఖాతాలో జమఅయి ఉంటాయి.

తాజాగా పీఎం కిసాన్ డబ్బులను నేడు (ఆగస్టు 9వ తేదీ) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 9.75 కోట్ల మంది రైతులకు లాభం చేకూరుతుంది. పీఎం కిసాన్ 9వ విడతలో భాగంగా..రూ.19వేల 500 కోట్లు బదిలీ కానున్నాయి.అయితే లబ్ధిదారులు ఈ డబ్బులు తమ ఖాతాలో పడ్డాయో లేదో అనేది ఎంతో సులభంగా బ్యాంకుకు వెళ్లి పని లేకుండా తెలుసుకోవచ్చు.

ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి pmkisan.gov.in కి వెళ్లండి. అక్కడ లబ్ధిదారుని స్థితి పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డేటా పొందండి బటన్ పై క్లిక్ చేస్తే మన అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేదో తెలిసిపోతుంది.

Related Topics

pm kisan money farmers depostited

Share your comments

Subscribe Magazine