News

అద్భుతం సృష్టించిన వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థుల పుట్టగొడుగులను సాగు చేసి రూ.30,000లకు పైగా లాభం పొందారు.

S Vinay
S Vinay

వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల 2018 బ్యాచ్‌కు చెందిన 15 మంది విద్యార్థుల బృందం కళాశాల మైదానంలో మిల్కీ మరియు ఆయిస్టర్ రకాల పుట్ట గొడుగులను పండించి రూ. 30,000. లాభాన్ని గడించారు. జనవరిలో, 2018 బ్యాచ్‌కి చెందిన 15 మంది విద్యార్థుల బృందం కళాశాల మైదానంలో దాదాపు రూ. 25,000 పెట్టుబడి పెట్టి మిల్కీ మరియు ఓస్టెర్ పుట్టగొడుగు రకాలనుపండించడం ప్రారంభించారు. వీటిని మార్కెట్లో విక్రయించగా రూ 30,000 లాభం వచ్చింది.

ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే బటన్ మష్రూమ్‌లు సాధారణంగా మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. కాలేజ్‌లోని ప్లాంట్ పాథాలజీ విభాగం విద్యార్థులను మిల్కీ మరియు ఓస్టెర్ రకాల పుట్టగొడుగులను పెంచేలా ప్రోత్సహించింది, ఇవి చాలా అరుదుగా లభిస్తాయి మరియు వీటికి అధిక డిమాండ్‌ ఉంటుంది.

పాథాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్ శారద జయలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం ప్రదీప్ ఇప్పటికే పుట్టగొడుగుల పెంపకాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు విలువైన సూచనలను విద్యార్థులకి వివరిస్తూ ఉన్నారు.


విద్యార్థులు కళాశాల ల్యాబ్‌లో తమ విత్తనాన్ని పెంచుకున్నారు మరియు వీటి పెంపకానికి కావాల్సిన వనరుల కోసం కళాశాల నిధులను పొందారు. సెమిస్టర్ అధ్యయన ప్రాజెక్ట్‌లో భాగంగా విద్యార్థులు పుట్టగొడుగులను పెంచారు . ఇది వ్యవసాయ ఆర్థిక విషయాలు మరియు మార్కెటింగ్ గురించి తెలుసుకోవడానికి వీలు కల్పించిందని విద్యార్థులు తెలిపారు. పండించిన పుట్ట గొడుగులని వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల బ్రాండ్ పేరుతో మార్కెట్లో విక్రయించారు.
కళాశాల ఈ ప్రోగ్రామ్ కోసం ఒక ప్రత్యేకమైన ఖాతాని ఏర్పాటు చేసింది ,వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే విద్యార్థులు దాని నుండి తమకు అవసరమైన నిధులను పొందవచ్చు.అయితే, వారు ఆర్జించిన సంపాదనలో కొంత భాగాన్ని అదే ఖాతాలో తిరిగి జమ చేయాల్సి ఉంటుంది

మరిన్ని చదవండి

మామిడి పండ్లను విదేశాలకి ఎగుమతి చేసి మంచి లాభాలను పొందడానికి ఈ సూచనలను పాటించండి

Share your comments

Subscribe Magazine