Government Schemes

ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన పథకం (PMKSY ) క్రింద తుంపర్లు , స్పీన్క్లర్ ల పై 55% శాతం రాయితీ ...

Srikanth B
Srikanth B
Drip Irrigation
Drip Irrigation

వ్యవసాయ రంగం లో ఉత్త్పదకత ను పెంచడానికి వివిధ వ్యవసాయ పనిముట్ల పై ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన (PMKSY) పథకం ద్వారా రాయితీని కల్పిస్తున్నట్లు కేంద్ర వయ్వసాయ మరియు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు . జాతీయ వయవసాయ మరియు సంక్షేమ శాఖ వారు తక్కువ నీరు ఎక్కువ పంట అనే నినాదం తో ఈ పథకాన్ని ప్రారంభించారు . 2015-2016 నుంచి ఏది అన్ని రాష్ట్రాలలో అమలులో ఉందని అయన తెలిపారు .  

ముఖ్యముగా ఈ పథకాల్లో భాగం గ తక్కువ నీటి వినియోగం తో ఎక్కువ పంటలు పండించే విధంగ బిందు సేద్యం మరియు స్పిన్క్లర్ల ల వినియోగించి ఎక్కువ పంటలను పండించడానికి 55 శాతం రాయితీ తో అందించడం జరుగుతుంది . ఈ పథకం క్రింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT ) ద్వారా అందించడం జరుగుతుంది . 

ఈ పథకం లో 55 శాతం  సబ్సిడీ  మిగిలిన 45 శాతము లబ్ధిదారులు జత చేయవలసి ఉంటుంది . అయితే కొన్ని రాష్ట్రాలు వీటికి అదనముగా సబ్సిడీ కూడా అందిస్తున్నాయి. ఇప్పటికే 1, 85,235 మంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాయితీలు లబ్ది పొందినాటు కేంద్ర వ్యవసా శాఖ మంత్రి తెలిపారు . 

ఏ విధంగ దీనికి దరఖాస్తు చేసుకోవాలి ?

ఈ  పథకం కింద ధరఖాస్తుచేసుకోవడనికి ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ కేంద్రాలకు వెళ్లి సమాచారం తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి. 

కావాల్సిన ధ్రువపత్రాలు : భూమికి సంబందించిన పాస్ బుక్ , బ్యాంకు పాస్ బుక్, ఆధార్  కార్డు , కుల ధ్రువీకరణ పత్రం , మొబైల్ నెంబర్ OTP  కొరకు 

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన పథకం(PMSKY) వెబ్సైటు లో దరఖాస్తు చేసుకోవాలి . 

సూక్ష్మ సేద్యం యొక్క ప్రాముఖ్యత : నీటి ఎద్దడి కలిగిన ప్రదేశాలలో రైతులు  తక్కువ నీటి తో అధిక పాటలను సాగు చెసుకోవచ్చు, బిందుసేద్యం ద్వారా రోజుకు ఒక మొక్క కు 2 లీటర్ల నుంచి 20 లీటర్ల వరకు నీటిని అదిచవచ్చు , త ద్వారా తక్కువ నీటి ఠీ అధిక సాగుకు వీలు కలుగు తుంది . 

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More