Government Schemes

దళిత బంధు ద్వారా దళితులు స్వయం వృద్ధి సాధించగలరు - జగదీశ్‌రెడ్డి

Srikanth B
Srikanth B

రాష్ట్రంలో దళితులు స్వయం వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దళిత బంధు కార్యక్రమమని శ్రీకారం చుట్టారని ఇంధన మరియు సహజ వనరుల శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

జిల్లాలోని చివ్వెంల మండలం తుల్జారావుపేటలో దళితుల బంధు పథకం లబ్ధిదారులకు పాడిపరిశ్రమ, గొర్రెల యూనిట్లు, ట్రాక్టర్‌లను పంపిణీ చేసిన అనంతరం జరిగిన సామూహిక మధ్యాహ్న భోజనంలో కార్యక్రమంలో పాల్గొన్న  ఆయన  మాట్లాడుతూ దళిత బంధు పథకం రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపిందని అన్నారు. దశాబ్దాలుగా కార్మికులు, ఉద్యోగులుగా కొనసాగుతున్న దళితులు ఈ పథకం వల్ల వ్యాపారాలకు యజమానులుగా మారుతున్నారు. రాష్ట్రంలో దళితుల ఆర్థిక పురోగతి సాధిస్తారని దళితులకు  కోసం ముఖ్యమంత్రి  కన్నాకలలు సహకారం అవుతాయని ,   దళిత బంధు  ద్వారా మాత్రమే సహకారం  కన్నాకలలు సహకారం అవుతాయని  అయన వెళ్లడించారు .

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు. అందుకే ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు అండగా నిలిచారని గుర్తు చేశారు. దళితులు ఆర్థిక స్వావలంబన సాధించడమే కాకుండా తమ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహించడంలో ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలని అయన ఆశిస్తున్నట్లు అయన వెల్లడించాహ్రూ

ఈ సందర్భంగా 51 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం క్వింటాల్‌కు రూ. 2,500 !

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More