News

ఆంధ్రప్రదేశ్‌లోని 7.7 లక్షలమంది రైతులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ నెలలో అకౌంట్‌లో డబ్బులు జమ!

Gokavarapu siva
Gokavarapu siva

జగన్ సర్కార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కౌలు రైతులకు మంచి శుభవార్తను అందించింది. రైతు భరోసా కేంద్రాల (RBKలు) సౌజన్యంతో ఈ సంవత్సరం 7.77 లక్షల మంది రైతులకు కౌలు కార్డులను అందజేసారు. ఈ రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్ కూడా అప్లోడ్ చేసినట్లు తెలిపారు. ఈ కౌలు రైతులకు కూడా వచ్చే సెప్టెంబర్‌ నెలలో రైతు భరోసా తొలి విడత సాయం అందించనున్నట్లు తెలిపారు.

దానితోపాటుగా ఈ సంవత్సరం కౌలు రైతులకు భారీగా రూ.4వేల కోట్ల పంట రుణాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత నాలుగు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరంలో ఎక్కువగా కౌలు కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నిర్వహించిన ప్రత్యేక మేళాల్లో రికార్డు స్థాయిలో కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసింది. ఈ కౌలు కార్డులకు 11 నెలల కాల పరిమితి ఉంటుంది.

ఇది కూడా చదవండి..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడ్రోజుల పాటు వర్షాలు..

గత నాలుగేళ్లుగా ప్రభుత్వం సీసీఆర్‌సీ కార్యక్రమం ద్వారా పంట రుణాలు, పలు రకాల సంక్షేమ ఫలాలను అందజేస్తూ కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. 2019-20లో, మొత్తం 272,720 మంది రైతులకు CCRC కార్డ్‌లు జారీ చేసింది, 2020-21లో 414,770 మంది వ్యక్తులు మరియు 2021-22లో 524,203 మంది రైతులకు CCRC కార్డ్‌లు జారీ చేసింది.

వ్యవసాయ నష్టాలను ఎదుర్కొంటున్న 1.73 లక్షల మంది రైతులకు సహాయంగా రూ.487.14 కోట్లు ఉచిత పంట బీమా పరిహారంగా పంపిణీ చేయబడింది. ఈసారి ఆర్బీకేల ద్వారా సీసీఆర్సీ మేళాలు నిర్వహించారు. ఈ మేళాల ద్వారా రికార్డు స్థాయిలో 7,77,417 మందికి సీసీఆర్సీలు జారీ చేశారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 4,51,545 మంది ఉన్నారు.

ఇది కూడా చదవండి..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడ్రోజుల పాటు వర్షాలు..

Related Topics

farmers andhra pradesh

Share your comments

Subscribe Magazine