News

మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక పాకిస్థాన్ ఉన్నామా?

S Vinay
S Vinay

గుంటూరు జిల్లాలో గల జిన్నా టవర్‌ పేరు మార్చాలని కోరుతూ బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు.

జిన్నా టవర్‌కు మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న తరువాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంగళవారం బిజెపి జాతీయ కార్యదర్శులు సునీల్ దేవధర్ మరియు సత్య కుమార్‌తో సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు జిన్నా టవర్ వద్ద నిరసన చేయడానికి ప్రయత్నించారు, కాని పోలీసులు విఫలం వారిని అదుపులోకి తీసుకున్నారు. చారిత్రాత్మకమైన జిన్నా టవర్ పేరు మార్చాలని గత కొన్ని నెలలుగా బీజేపీనేతలు డిమాండ్ చేస్తున్నారు.

తమ పార్టీ నేతలపై పోలీసులు వ్యవహరించిన తీరు బాలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ‘మనం ఏపీలో ఉన్నామా లేక పాకిస్థాన్‌లో ఉన్నామా’ అని ట్వీట్‌ చేసారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ టవర్ పేరు మార్చాలని తమ పార్టీ మాత్రమే కాకుండా ప్రజలు కూడా కోరుతున్నారు. జిన్నా పేరును తొలగించి, టవర్‌కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలన్న డిమాండ్‌కు తెలియపరిచారు.

అసలు జిన్నా టవర్ పేరు ఎలా వచ్చింది?

జిన్నాటవర్ స్వాతంత్రానికి ముందు పాకిస్తాన్ స్థాపకుడు అయిన మహమ్మద్ అలీ జిన్నా యొక్క ప్రతినిధి ఈ పట్టణాన్ని సందర్శించిన సందర్బంగా నిర్మించబడింది. ఇది ఆరు స్తంభాలపై నిర్మించబడింది. ప్రస్తుతం ఈ టవర్ దాదాపు శిథిలావస్థకు చేరుకుంది.వివాదాలకు స్వస్తి పలకాలని గుంటూరు నగరపాలక సంస్థ గతంలో టవర్ కి భారత జెండా రంగులు వేసి నిర్మాణం చుట్టూ కంచెను ఏర్పాటు చేసింది.

మరిన్ని చదవండి.

మే 31న పీఎం కిసాన్ 11 వ వాయిదా విడుదల...వెల్లడించిన వ్యవసాయ మంత్రి

పోలీస్ నియామకాల్లో మాకు అవకాశం ఇవ్వండి...ట్రాన్సజెండర్ల విజ్ఞప్తి!

పిల్లల చదువుకి తల్లిద్రండులు చేస్తున్న ఖర్చు....సర్వే వివరాలు!

Share your comments

Subscribe Magazine