News

మే 31న పీఎం కిసాన్ 11 వ వాయిదా విడుదల...వెల్లడించిన వ్యవసాయ మంత్రి!

S Vinay
S Vinay

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మే 31 నాటికి రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నట్లుకేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

పీఎం కిసాన్ యోజన 11 వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త .వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 11 వ విడత విడుదల తేదీని ప్రకటించారు.మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తోమర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 2022 మే 31 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదుపరి విడత రూ. 2,000ని రైతులకు బదిలీ చేస్తారని తోమర్ చెప్పారు. చివరి విడతను 1 జనవరి 2022న ప్రధాని మోదీ విడుదల చేశారు.

ఈ ప్రభుత్వ పథకం నుండి ప్రయోజనం పొందాలంటే, లబ్ధిదారులందరూ తమ eKYCని అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని తోమర్ స్పష్టం చేశారు. ఒకవేళ eKYC అప్‌డేట్ కాకపోతే మే 31లోపు చేయండి లేదంటే మీకు డబ్బు రాదు.

PM కిసాన్ జాబితా 2022ని ఎలా తనిఖీ చేయాలి?
ముందుగా, మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక పోర్టల్‌కి వెళ్లాలి

హోమ్‌పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' (Farmers Corner)పై క్లిక్ చేయండి.

ఆపై లబ్ధిదారుల జాబితా లింక్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీరు ఇక్కడ మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ మరియు గ్రామ సమాచారాన్ని నమోదు చేయాలి.

చివరగా, మీరు 'గెట్ రిపోర్ట్'పై క్లిక్ చేయాలి మరియు జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.

 

PM కిసాన్ నమోదు ప్రక్రియ
రైతులు పిఎం కిసాన్ యోజన కింద ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని గమనించాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం, మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, 'ఫార్మర్స్ కార్నర్'పై క్లిక్ చేయాలి.

దీని తర్వాత, 'కొత్త రైతు నమోదు' (New Farmer Registration) ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

ఆపై మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.

ఆ తర్వాత మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, క్యాప్చా కోడ్‌ను పూరించండి.

ఆ తర్వాత మీరు అడిగిన వివరాలను నమోదు చేయాలి.

ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతా మరియు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నమోదు చేయండి.

సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

మరిన్ని చదవండి.

మానవ మనుగడకి పంచ భూతాలు ఎంత అవసరమో తేనెటీగలు కూడా అంతే అవసరం!

Share your comments

Subscribe Magazine